విభజన చట్టంలో “ఒకే రాజధాని” అని లేదని కేంద్రం అఫిడవిట్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూడు రాజధానుల అంశానికి సంబంధించి కేంద్రం తన వంతు ఎంత సహకారం కావాలో అంత సహకారం అందిస్తోంది. విభజన చట్టాన్ని ఉల్లంఘించి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని.. విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని.. కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే.. రంగంలోకి దిగిన కేంద్రం.. ఈ అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చట్టంలో ఉందని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

రాజధాని విషయంలో కేంద్రానికి పాత్ర ఉందని.. విభజన చట్టం, శివరామకృష్ణన్ కమిటీ వంటి వాటిని ప్రస్తావిస్తూ.. కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని లేదా.. రాజధానులు అంశంలో తమకేమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. పిటిషనర్లు కేవలం అపోహతోనే ఉన్నారని.. కేంద్ర హోంశాఖ తెలిపింది. విభజన చట్టం ప్రకారం చూస్తే.. మూడు రాజధానులు పెట్టుకోవచ్చని కేంద్రం నేరుగా హైకోర్టుకు.. ఈ అఫిడవిట్ ద్వారా చెప్పినట్లయింది.

కేంద్ర ప్రభుత్వ చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంది. “రాజధాని లేదా రాజధానులు” అని లేదు. శివరామకృష్ణన్ కమిటీ కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకు రాలేదు. ఇవన్నీ తెలిసినప్పటికీ.. కేంద్రం కొత్తగా “రాజధాని లేదా రాజధానులు” పదం తీసుకొచ్చి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం.. న్యాయవర్గాలను సైతం విస్మయ పరుస్తోంది. మూడు రాజధానులకు పూర్తి స్థాయిలో సహకారం అందించే లక్ష్యంతోనే కేంద్రం.. ఇలా చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విబజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉంటే.. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మాత్రం.. దానికి “రాజధాని లేదా రాజధానులు” అనే భాష్యం చెప్పడం… కొత్త మలుపుగా అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close