పోలవరంలో అవినీతికి ఆధారాల్లేవని తేల్చిన కేంద్రం..!

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందనడానికి ప్రాథమిక ఆధారాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. గత ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ..పోలవరంను చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారంటూ.. విమర్శలు చేశారు. దీన్నే గుర్తు చేస్తూ.. జనసేన నేత ,రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు.. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు. పోలవరం అవినీతిపై వివరాలు బయట పెట్టాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ పెంటపాటి పుల్లారావుకు సమాధానం పంపింది. పోలవరంలో అవినీతి జరిగిందని.. విచారణ జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తను ఆదేశించలేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఓ విచారణ కమిటీని నియమించింది.. ఆ కమిటీ నివేదికను.. ఏపీ ప్రభుత్వమే పక్కన పెట్టిందని జలశక్తి శాఖ స్పష్టం చేసింది.

ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ అధికారి రేమండ్ పీటర్ అనే జగన్ బంధువు నేతృత్వంలో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలన జరిపి.. అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ నివేదికను తీసుకెళ్లి జలశక్తి శాఖకు.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ ఇచ్చారు. దాంట్లో ఉన్న అవినీతి ఆరోపణలపై.. ఆధారాలు కావాలని… జలశక్తి శాఖ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. రేమండ్ పీటర్ కమిటీ చేసిన ఆరోపణలు.. పేర్కొన్న అవినీతి అంశాలకు ఆధారాలు కావాలని రెండు, మూడుసార్లు లేఖలు రాసినా స్పందించలేదు. అదే సమయంలో పోలవరానికి విడుదల చేయాల్సిన పెండింగ్ నిధులు కూడా.. ఏపీ సర్కార్ నియమించిన కమిటీ గుర్తించినట్లుగా చెప్పిన అవకతవకల వ్యవహారం తేలిన తర్వాతే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. దీంతో ఏపీ సర్కార్.. రేమండ్ పీటర్ కమిటీ అవినీతి చేసిందని చెప్పిన వాటిని ఆధారాలు సమర్పించలేక.. ఆ నివేదికను తాము పక్కన పెడుతున్నామని పరిగణనలోకి తీసుకోవద్దని జలశక్తి శాఖకు సూచించిది.

ఇదే విషయాన్ని పెంటపాటి పుల్లారావుకు జలశక్తి శాఖ తెలిపినట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగానే.. అవినీతికి తావు లేకుండా పోలవరం నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం తమకు చెప్పినట్లుగా కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. పోలవరంలో అవినీతి అంటూ.. వైసీపీ నేతలు .. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు కేంద్ర జలశక్తి శాఖనే చెక్ పెట్టినట్లయింది. రేమండ్ పీటర్ కమిటీ అమరావతిపై కూడా.. ఇలాంటి ఓ నివేదిక తయారు చేసింది. అందులో 30వేల కోట్ల గోల్ మాల్ జరిగినట్లుగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను మీడియాకు లీక్ చేశారు. మొత్తంగా పదివేల కోట్ల విలువైన పనులు జరిగితే 30వేల కోట్ల గోల్ మాల్ ఎలా జరిగిందనే విమర్శలు రావడంతో.. ఏపీ సర్కార్ ఆ రిపోర్ట్‌ను బయట పెట్టలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close