హమ్మయ్య…కేంద్రం రూ.1800 కోట్లు మంజూరు చేసింది

కేంద్ర మంత్రి సుజన చౌదరి ఈ ఆర్ధిక సంవత్సరం చివరి రోజయిన ఈరోజు ఒక మంచి కబురు చెప్పారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి వివిధ పద్దుల క్రింద రూ. 1800 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆ డబ్బు ఈరోజు రాత్రిలోగా ఆంధ్రప్రదేశ్ ఖాతాలోకి బదిలీ అవుతాయని తెలిపారు. దానిలో రూ. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.600 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. 200 కోట్లు, రెవెన్యూ లోటు భర్తీకి రూ.1, 000 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. సెంట్రల్ టాక్సులో రాష్ట్ర వాటాగా రూ.650 కోట్లు మరొక వారం రోజులలోగా వస్తుందని మంత్రి సుజనా చౌదరి మీడియాకి తెలిపారు.

కేంద్రప్రభుత్వం బడ్జెట్ లో పోలవరానికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. బడ్జెట్ లో ప్రత్యేకంగా తగినన్ని నిధులు కేటాయించకపోయినా తరువాత విడుదల చేస్తామని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ, రాష్ట్ర బడ్జెట్ లోనే పోలవరం నిర్మాణానికి రూ.3,660 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు కేటాయించింది. అయితే నిధుల కోసం కేంద్రప్రభుత్వం నిరంతరం ఒత్తిడి చేయడం మాత్రం మానుకోలేదు. తత్ఫలితంగానే కేంద్రం పోలవరం కోసం అధనంగా మరో రూ.500 కోట్లు, రాజధాని కోసం రూ.200 కోట్లు మంజూరు చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి కూడా భారీగా నిధులు విడుదల చేయడం హర్షణీయం.

అయితే కేంద్రప్రభుత్వాన్ని నిధుల కోసం ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సరిగ్గా లెక్కలు చూపడం లేదని భాజపా నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం కోసం కేంద్రం మంజూరు చేస్తున్న నిధులకు రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా లెక్కలు చూపడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులను దుబారా చేస్తోందని కాగ్ కూడా మొట్టికాయలు వేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు భారీగా జీత భత్యాలు పెంచేసి, మళ్ళీ అందరికీ చాలా ఖరీదయిన ఐ-ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. కనుక కేంద్రప్రభుత్వం ఎంత నిధులు విడుదల చేస్తున్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా, పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడే ప్రయోజనం ఉంటుంది. లేకుంటే కేంద్రప్రభుత్వం కూడా ఇంకా ఎంత ఒత్తిడి చేసిన ఇక ముందు నిధులు విడుదల చేయకపోవచ్చును. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే ఇబ్బందులు పడవలసిఉంటుంది. పైగా దాని వలన తెదేపా-భాజపాల స్నేహ సంబంధాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close