కామన్ సివిల్ కోడ్ కి సిద్ధమౌతున్న రంగం!

కామన్ సివిల్ కోడ్ కి సిద్ధమౌతున్న రంగం!
ముస్లిం మహిళల్లో చైతన్యమే మూలం!!

దేశమంతటికీ ఒకే పౌరచట్టం “కామన్ సివిల్ కోడ్” కామన్ సివిల్ కోడ్ అమలు చేసే విషయమై సూచనలు ఇవ్వాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అధికారిక ఉత్తరం ద్వారా లా కమీషన్ చైర్మన్ ను కోరారు.

ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలన్నది బిజెపి విధానమే! అయితే అది ఒక రాజకీయ అస్త్రంకూడా! హిందూత్వం ఎన్నికల్లో ఉపయోగపడే అవకాశాలున్నపుడే దీన్ని బయటకు తీస్తూ వుంటారు. ఈ సారి సందర్భం తొమ్మిది నెలల్లో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలే ఈ సారి సందర్భం!
భారత వివాహ చట్టాలలో బహుభార్వాత్వానికి వీలు లేదు, ఏకపక్ష విడాకులకు అవకాశంలేదు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం పురుషులు ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్య, భార్యలతో చెప్పాపెట్టకుండానే వారికి విడాకులు ఇవ్వవచ్చు. కామన్ సివిల్ కోడ్ వర్తింపజేస్తే ఈ ఆచార వ్యవహారాలు సాగవు.

ముస్లిం మహిళలు తమ వ్యక్తిగత, సాంఘిక, ఆర్ధిక భద్రతలకోసం కోర్టులకు ఎక్కుతున్నారు. ఆరేబియా దేశాల్లోకూడా మహిళల విషయంలో ముస్లిం చట్టాలను రద్దు చేసి వారి హక్కులను కాపాడుతున్నాయి.

భారత్‌లాంటి భిన్న మతాలు, సంస్కృతులున్న దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు సాధ్యం కాదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటివారు వ్యతిరేకిస్తూనే వున్నారు..దేశంలో ప్రస్తుతం నేర శిక్షాస్మృతి తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలతో పాటు హిందు వివాహ చట్టం, షరియత్‌కు సంబంధించిన ముస్లిం పర్సనల్‌లా అమల్లో ఉన్నాయి. ముస్లింలు చాలాకాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమలును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయటం అంటే తమ విశ్వాసాలను దెబ్బతీయటమే అన్నది వారి వాదన.

ప్రధానిగా వాజపేయి హయాంలోనూ బిజెపి ఉమ్మడి పౌరస్మృతిపై దృష్టిపెట్టినా, అమలుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దేశ ప్రజలందరికీ ఒకే చట్టం అమలుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించటం తెలిసిందే. కొందరు ముస్లిం మహిళలు తమ భర్తల ఏకపక్ష విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తలుపులు తట్టినప్పుడు న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

వాజ్ పాయ్ హయాంలో జరగనిది మోదీ హయాంలో కదిలింది. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బిజెపి యోచన.

ఉమ్మడి పౌర స్మృతి అమలుపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశ ప్రజలందరికి ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధం కావటాన్ని స్వాగతిస్తానని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి మహేష్ శర్మ చెప్పారు. సిపిఐ కార్యదర్శి డి రాజా కూడా ఉమ్మడి పౌరస్మృతి పట్ల సానుకూలంగా స్పందించారు. దేశంలోని మహిళల హక్కులను పరిరక్షించాల్సి ఉందంటూ, లా కమిషన్ ఏంచెబుతుందనేది చూసిన తరువాత పూర్తిస్థాయి ప్రతిస్పందన ఇవ్వటం మంచిదని అన్నారు.

ఈ కదలిక వెనుక బిజెపి ముందడుగుకంటే, మోదీ చొరవకంటే, ముస్లిం మహిళలలో వచ్చిన చైతన్యమే ఎక్కువగా కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close