కన్నెర్ర కాదు, కళ్లు తెరిస్తే మేలు!

మూడేళ్లపాలన సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడే తీరు విచిత్రంగా వుంది. ఎవరైనా మేము వేసే రోడ్ల మీదనే వెళ్లాలి, మేము నడిపే బస్సులే ఎక్కాలి అంటూ ఓటుమాత్రం మరెవరికి వేస్తారని ప్రశ్నించడం తమాషాగా వుంది. ఇదే తర్కం ప్రకారమైతే ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వాలు నడిపే పార్టీలు ఓడిపోకూడదు. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతలే తప్ప అవి ఘనకార్యాలు కావు.వాటిలోనూ అనేక లోపాలు లొసుగులు అక్రమాలు అవతతవకలు వుండనే వున్నాయి. హైదరాబాదును తాను అభివృద్ధి చేయడం వల్లనే అన్ని చోట్లనుంచి అక్కడకు చేరారంటున్న చంద్రబాబు ఆ నగరం నలభై ఏళ్లు రాజధానిగా వున్నాక తను అధికారంలోకి వచ్చానని మర్చిపోతున్నారు. అంతకు ముందు అది ఎడారిగా లేదు. అప్పుడు ఐటికూడా లేదు. చేసిందానికి సంతోషం వేరు అతిశయోక్తిగా చెప్పుకోవడం వేరు.ఇక ఇప్పుడు అమరావతిలోనూ అదే నమూనాను అనుసరిస్తారని 35 లక్షల జనాభా వచ్చేస్తారని చెప్పడం దీని కొనసాగింపే. విజయవాడ గుంటూరు నగరాల్లోనే ఇంతవరకూ ఇందులో సగం జనాభా కూడా లేదు. ప్రపంచంలో ఎక్కడా అంత వేగంగా జనాభా తరలివెళ్లిన దాఖలాలు కూడా లేవు. విజన్ల గురించి ముందస్తు ప్రణాళికల గురించి చెప్పే చంద్రబాబు ఇంత తేలికైన లెక్కలు ఎలా వేస్తున్నారో అర్థం కాదు.అసలు మహానగరాల కాన్సెప్ట్‌ మంచిది కాదని పట్టణ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. అందుకే పాత నగరాలను మినహాయిస్తే కొత్తగా మనం వేరే పేర్లు వినడం చాలా తక్కువ.పుత్రజయ వంటివాటి జనాభా గాని పరిధిగాని చాలా పరిమితం. కనుక ముఖ్యమంత్రి వాస్తవికంగా త్వరితంగా రాజధాని నిర్మాణం చేస్తే మంచిదితప్ప నేను కన్నెర్ర చేస్తే తట్టుకోలేరని భయపెట్టచూడటం సరికాదు. కావలసింది కళ్లు తెవరవడే గాని ఎర్రబడటంకాదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close