మళ్ళీ తెలుగు ముఖ్యమంత్రుల సమావేశం – ఈ సారి కేంద్రం జోక్యం!

కృష్ణాజలాల కేటాయింపులపై పరస్పర విమర్శలతో చిక్కుముడులు బిగిస్తున్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నెల మూడవ వారంలో అనుకూలమైన తేదీలను సూచించాలని, దీనికి అనుగుణంగా సమావేశాన్ని ఖరారు చేస్తామని కేంద్రం రెండు రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది.

కృష్ణా జల వివాదాలపై కేంద్ర జలవనరుల శాఖ అత్యున్నత మండలి (ఎపెక్స్ కౌన్సిల్) సమావేశాన్ని నిర్వహించి పరిష్కరించాలని ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జీత్‌సింగ్ రెండు రాష్ట్రప్రభుత్వ కార్యదర్శులకు లేఖ రాశారు.

సమావేశం తేదీలు ఖరారైతే ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సిఎంలతోపాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు హాజరవుతారు. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల అధికారాలు కృష్ణా బోర్డుకు ఇవ్వాలని బోర్డు గతంలోనే కేంద్రాన్ని కోరింది. ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ ప్రతిపాదనకు తెలంగాణ ఒప్పుకోవడంలేదు. జూరాలనుంచి ప్రకాశం బ్యారేజీ వరకు టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు తెలంగాణ సమ్మతి తెలియచేయగా, నాగార్జునసాగర్ వరకు చాలని, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వద్ద ఈ పరికరాలను అమర్చడానికి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవడంలేదు.

రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల స్కీంలపై ఏపి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఈ ప్రాజెక్టులు అక్రమమని ప్రకటించాలని కేంద్రాన్ని ఏపి కోరింది. కాని తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పరిస్ధితుల్లో ఈ ప్రాజెక్టులపై రాజీపడే ప్రసక్తిలేదని, కృష్ణా జలాల్లో తమ కేటాయింపులకు అనుగుణంగానే నీటిని వినియోగించుకుంటామని తేల్చిచెప్పింది.

పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం ప్రాజెక్టునుంచి ఎడాపెడా నీటిని తోడుతున్నారని తెలంగాణ కేంద్రానికి తాజాగా ఎపి మీద ఫిర్యాదు చేసింది. జల విద్యుత్‌లో కూడా సగం వాటా ఇవ్వడం లేదని అందులో వివరించారు. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువున నీటి వినియోగం జరపరాదని, నిల్వ ఉంచాలని, దీనివల్ల రాయలసీమ సాగునీటి ప్రయోజనాలకు అటంకం కలగదని ఏపి వాదిస్తోంది. కాగా 837 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవచ్చని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే జీవోలు ఉన్నాయని, కరవుకాలంలో తాగునీటిని ఆ మట్టం వరకు నీటిని వినియోగించుకుంటామని తెలంగాణ చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close