దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహులు: మోడీ లైన్లో చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కందుకూరు సభలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా వాగ్బాణాలు సంధించడం లో ఈమధ్య మోడీని ఫాలో అవుతున్నారా అనిపిస్తోంది. నిన్న కందుకూరు సభలో ఆయన వ్యాఖ్యలు చేస్తూ బిజెపి పార్టీ సమర్థించే వారందరూ రాష్ట్ర ద్రోహులు అంటూ వ్యాఖ్యలు చేశారు.

నిన్న కందుకూరు సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్రప్రభుత్వంపై నేను ధర్మపోరాటం చేస్తుంటే.. కొంతమంది కేంద్రానికి సహకరిస్తూ నాపై దాడి చేస్తున్నారు. అలాంటివారంతా రాష్ట్ర ద్రోహులే. గతంలో బ్రిటిష్‌ పాలకులు స్థానికంగా కొంతమందిని లోబరచుకుని.. దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న విధంగా ప్రస్తుత కేంద్రం కూడా రాష్ట్రంలో కొందరిని లోబరచుకుని టీడీపీపైనా, రాష్ట్రంపైనా దాడి చేస్తోందని’ మండిపడ్డారు.

అయితే ఈ వ్యాఖ్యలు ఉన్నవాళ్లు గతంలో మోడీ మరియు బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మాట్లాడితే వెంటనే వాళ్లను దేశద్రోహులు గా, పాకిస్తాన్ ఏజెంట్ గా ముద్రవేయడం బిజెపి నాయకులకు పరిపాటి . ప్రకాష్ రాజ్ లాంటి నటులు అయితే, వాళ్లని ప్రశ్నిస్తున్నందుకు బిజెపి నాయకులు తనను పాకిస్తాన్ వెళ్లిపోవాలని అంటున్నారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బీజేపీని సమర్థించే వాళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే బహుశా చంద్రబాబు కూడా మోడీ బీజేపీ తరహా వ్యూహాన్నే అమలు చేస్తున్నాడనిపిస్తోంది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close