రాజ్‌భవన్‌ రాజకీయాలపై చంద్రబాబు డైరక్ట్ ఎటాక్..! ఇంతకీ ఏ గవర్నర్‌పై…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా బ్యాలెన్స్‌డ్‌ రాజకీయాలు చేస్తూంటారు. రాజకీయంగా ఆరోపణలు చేసేటప్పుడే ముందూ వెనుకా ఆలోచిస్తారు. అదే గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు చాలా వరకూ కంట్రోల్ చేసుకుంటూంటారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన గవర్నర్ వ్యవస్థపై తన ఆగ్రహాన్ని ఏ మాత్రం దాచుకోవడం లేదు. రాజ్‌భవన్ కేంద్రంగా… తెలుగుదేశం పార్టీపై, ప్రభుత్వంపై.. నరసింహన్ కుట్ర పన్నుతున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో.. కొద్ది రోజుల కిందట అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అని ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నేతలు ఒకరి తర్వాత ఒకరు గవర్నర్ పదవి కూడా గౌరవం ఇవ్వకుండా.. విమర్శించేశారు.

తాజాగా ఇప్పుడు చంద్రబాబు.. గవర్నర్ కార్యాలయాలను… కేంద్రం రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని… నేరుగా ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అటు ఢిల్లీలోనూ..ఇటు ఏపీలోనూ కలకలం రేగింది. కారణం… గవర్నర్ నరసింహన్ ప్రస్తుతం రాజకీయ నివేదికలతో… హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీల కోసం ఢిల్లీకి పరుగులు తీయడమే. కొద్ది రోజుల కిందటే… గంట సేపు ప్రధాని మోదీతో సమావేశమైన గవర్నర్ ఏపీ రాజకీయాలపైనే ఎక్కువగా చర్చించారన్న ప్రచారం జరిగింది. అలా హైదరాబాద్ వచ్చీ రాగానే ఏపీ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. మోదీని అందరూ తిడుతున్నారన్న కారణం చూపి.. ఫిర్యాదు చేయడానికి వెళ్లామని బీజేపీ నేతలు చెప్పుకున్నా… వాస్తవం మాత్రం.. గవర్నర్ నరసింహన్ ఢిల్లీ నుంచి ఏదో సందేశం తెచ్చారన్నదేనన్న అనుమానాలున్నాయి.

ఈ లోపే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేశారు. బీజేపీ అగ్రనేతలతో చర్చల్లో మునిగి తేలుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి… రామ్‌మాధవ్‌ను కలిశారు. కోఇన్సిడెన్స్‌గా ఏపీ రాజకీయాలపై నివేదికలతో గవర్నర్ ఢిల్లీకి చేరుకున్నారు. రాజకీయాలకు సంబంధం లేకపోతే.. హుటాహుటిన ఢిల్లీకి పోవాల్సినంత ఘనకార్యాలేమీ తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. ఇంకో విశేషం ఏమింటే… కేసీఆర్ కూడా…. అదే సమయంలో ఢిల్లీలో ఉండటం.

ఈ తరుణంలో… గవర్నర్ కేంద్రంగా.. ఢిల్లీలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయన్న కచ్చితమైన సమాచారం ఉండబట్టే…చంద్రబాబు ట్వీట్ చేశారని అందరూ భావించారు. అయితే వెంటనే… లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో ధర్నా చేస్తున్న ఢిల్లీ ముంఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలిపారు. గవర్నర్ రాజకీయాల కారణంగా… బాధలు పడుతున్న ఢిల్లీ ప్రజలకు సానుభూతి తెలిపారు.మొత్తానికి చంద్రబాబు గవర్నర్ వ్యవస్థను టార్గెట్ చేసి.. మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గవర్నర్ల వ్యవస్థపై మరోసారి చర్చను లేవదీశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close