‘మేనేజ్‌మెంట్’లో బాబును కొట్టే నాయకుడు మళ్ళీ పుడతాడా?

వ్యవస్థలను నాశనం చేశారు అని చెప్పి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ ఉంటాడు చంద్రబాబు. కానీ ఆ వ్యవస్థలను మేనేజ్ చేసే విషయంలో మాత్రం చంద్రబాబును కొట్టేటోడు లేడని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. పార్టీ ఫిరాయింపుల గురించి చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 2004 తర్వాత నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డిని, 2014 తర్వాత నుంచీ కెసీఆర్‌ని విమర్శలతో ఉతికి ఆరేశాడు చంద్రబాబు. ఢిల్లీ స్థాయిలో హల్చల్ చేశాడు. అప్పట్లో మీడియా కూడా ఫిరాయింపులను ప్రోత్సహించిన నాయకులను ఓ స్థాయిలో విమర్శించేది. జంతువులతో పోల్చడం అనేది చాలా చిన్న విమర్శ అనే స్థాయిలో చంద్రబాబు మీడియా, హంగామా ఉండేది. తలసాని శ్రీనివాస యాదవ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అయితే కెసీఆర్, తలసానిలపైన వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. విమర్శల జడివానను ఎలా ఎదుర్కోవాలో కూడా టీఆర్ఎస్ నేతలకు అర్థం కాలేదు.

తెలంగాణాలో కెసీఆర్ చేసినట్టుగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేశాడు. తలసాని చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినందుకు గానూ…ఏ గవర్నర్‌ని అయితే చంద్రబాబు విమర్శలతో ఉతికి ఆరేశాడో అదే గవర్నర్ నరసింహన్ ఇప్పుడు అదే తప్పును రిపీట్ చేశాడు. చంద్రబాబే దగ్గరుండి చేయించాడు. మరి చంద్రబాబు చేసిన తప్పుల గురించి ఎవరైనా మాట్లాడారా? గవర్నర్ తప్పును ఎత్తి చూపే ప్రయత్నం చేశారా? చంద్రబాబు మనవడు దేవాన్ష్‌తో గవర్నర్ ఎలా ఆడుకున్నాడు? దేవాన్ష్‌ని ఎంతమంది సంభ్రమాశ్ఛర్యాలతో చూశారు. దేవాన్ష్ ఎలా వెలిగిపోయాడు లాంటి వార్తలకు మాత్రం చాలా ప్రాధాన్యం దక్కింది. అదీ చంద్రబాబు మేనేజ్ చేసే విధానం. తాను చేసే తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడంలో చంద్రబాబుకు చంద్రబాబే సాటి. మీడియా, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు…ఇలా వేరే వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడిపోయే వాళ్ళందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే విమర్శనాస్త్రాలను దాచేస్తారు. భజనకు మాత్రం రెడీ అయిపోతారు. సోషల్ మీడియా పుణ్యమాని చంద్రబాబు చేస్తున్న తప్పుల గురించి కాస్తో కూస్తో చర్చలు జరుగుతున్నాయి కానీ లేకపోతే కనీస మాత్రం స్పందించేవాళ్ళు కూడా ఎవరూ ఉండరేమో. అందుకేనేమో…చంద్రబాబుతో సహా టిడిపి నాయకులందరూ కూడా సోషల్ మీడియాను నియంత్రించాలని తెగ తాపత్రయపడుతున్నారు. ప్రజలు మౌనంగా ఉంటే చంద్రబాబుకు అది కూడా సాధ్యమే. ఎందుకంటే దేశంలో ఉన్న ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేయగల సత్తా, సామర్థ్యం ఉన్న నాయకుడి చేతిలో అధికారం కూడా ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాను నియంత్రించడం పెద్ద విషయమా? ఎటొచ్చీ ప్రజల్లో వ్యతిరేకత ప్రబలుతోంది, అసలుకే మోసం వచ్చే అవకాశముంది అన్న హెచ్చరికలు వెళ్తేనే తప్పులు చేయడానికి భయపడతారు నాయకులు. చంద్రబాబు మేనేజ్‌మెంట్ దెబ్బకు ప్రజలను ఉద్ధరించడం కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకునేవాళ్ళందరూ కూడా బాబు భజనలో మునిగితేలుతున్న నేపథ్యంలో బాబు తప్పులను ఎత్తి చూపుతున్న…ధైర్యంగా స్పందిస్తున్న సోషల్ మీడియా జనాలను మాత్రం కచ్చితంగా అభినందించి తీరాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close