విశాఖలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుని ప్రారంభించిన చంద్రబాబు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఎప్పుడూ అందరి కంటే ముందుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఐదు గ్రిడ్స్ లో ఒకటయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకి ఈరోజు విశాఖలో ప్రారంభోత్సవం చేసారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నెలకి రూ.150లకే ఇంటింటికీ టెలీఫోన్ సౌకర్యం, 15ఎం.బి.పి.ఎస్. వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు టీవీ ఛానల్స్ అందించబోతున్నారు. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో గల ఒక భవనంలో తాత్కాలికంగా దీని కోసం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసారు.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో సుమారు 2661 కిమీ పొడవునా ఆప్టికల్ ఫబార్ కేబుళ్ళను వేశారు. వాటిని గృహాలకి అనుసంధానం చేసి ఈ మోఉ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మారుమూల గ్రామలను సైతం ఇంటర్నెట్, ఫోన్ ల ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. తద్వారా మారుమూల గ్రామాలకు టెలి మెడిసిన్, దూర విద్య, రైతులకు వ్యవసాయ సూచనలు, తదితర సౌకర్యాలు కల్పించవచ్చును. టెలి, వీడియో కాన్ఫరెన్స్ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ స్వచ్చంద సంస్థలు మారుమూల గ్రామాల ప్రజలతో సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే అవకాశం కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close