బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ -అంతా సీక్రెట్ !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుుడు ఢిల్లీ వెళ్లి అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు. మొదట అమిత్ షా ఇంటికి చంద్రబాబు వెళ్తే… కాసేపటికే జేపీ నడ్డా కూడా వచ్చారు. వారి మధ్య జరిగింది పూర్తిగా రాజకీయ పరమైన చర్చేనని ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. ఆ రాజకీయ చర్చ ఏమిటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది . టీడీపీతో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని.. ఎన్టీఏలో చేరాలని టీడీపీని అమిత్ షా ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు.

అయితే ఏపీలో కలిసి పని చేయడం.. పోటీ చేయడం అనేది సంక్లిష్టలతో కూడి ఉందని… వైసీపీకీ, జగన్ కు బీజేపీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న భావన ప్రజల్లో పాతుకుపోయిందని చంద్రబాబు అమిత్ షాకు చెప్పినట్లుగా భావిస్తున్నారు. రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా కేంద్రం సపోర్ట్ చేయడంతో పాటు విచ్చలవిడిగా అప్పులు చేయడానికి అంగీకరించడం .. ఇతర ప్రయోజనాలు కల్పించడం…. చివరికి వివేకా హత్య కేసులోనూ కాపాడుతూండటం వంటివి ప్రజల్లో బాగా చర్చనీయాంశమవుతున్నాయి చంద్రబాబు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు టీడీపీతో బీజేపీ కలిసినా అది మైనస్సే అవుతుందని.. ముందు వైసీపీకి వ్యతిరేకం అనే భావన బీజేపీ తేవాలని.. చంద్రబాబు కోరినట్లుగా భావిస్తున్నారు.

అయితే ఒక్కటి మాత్రం నిజమని.. వైసీపీకి ఇలాంటి సహకారం కొనసాగిస్తూ ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం .. లేకపోతే ఎన్డీఏలో చేరడం అనేది జరగదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో అయినా మరో రాష్ట్రంలో అయినా టీడీపీ నుంచి సహకారం పొందాలంటే.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి. టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటే… బీజేపీ .. టీడీపీ ఇచ్చే ఇన్ పుట్స్ ను ఫాలో అవుతుంది. లేకపోతే అవదని.. వచ్చే రెండు, మూడు వారాల్లో ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close