పోలవరం గ్యాలరీ వాక్..! కేక్ వాక్‌గా పబ్లిసిటీ చేసుకున్న టీడీపీ..!!

పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్ వే గ్యాలరీ నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టులో అంత్యంత కీలకమైన స్పిల్ వే నిర్మాణంలో అంతర్భాగంగా నిర్మించిన గ్యాలరీలో ముఖ్యమంత్రి “గ్యాలరీ వాక్” నిర్వహించారు. రెండు మీటర్ల వెడల్పు, రెండున్నర మీటర్ల ఎత్తులో 1069.5 మీటర్ల పొడవున స్పిల్ వే లోపల సొరంగం తరహాలో స్పిల్ వే గ్యాలరీని నిర్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గ్యాలరీ వాక్ ను పండుగలా నిర్వహించుకుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 48 బ్లాకులు, 1.054 కిలోమీటర్లు నడిచారు. తానే శంకుస్థాపన చేశా.. తానే గ్యాలరీ వాక్ చేసినందుకు.. చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వచ్చే ఏడాది మేలోపు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. నిద్రపోయేటప్పుడు కూడా గుర్తొచ్చే ప్రాజెక్టు పోలవరమన్నారు. పోలవరంలో కొన్ని వందల మిషన్లు పనిచేస్తున్నాయని వివిధ దేశాల నుంచి అత్యాధునిక యంత్రాలు తెప్పించామని.. డబ్బులు చెల్లించకపోతే పనులు ఆగిపోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నా గొంతులో ప్రాణమున్నంత వరకు అపజయమనేదే లేదని.. విజయం సాధించి తీరతానన్నారు. నాగార్జునసాగర్‌కు నెహ్రూ శంకుస్థాపన చేస్తే…ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్‌ చేశారని .. పోలవరానికి తానే శంకుస్థాపన చేసి తానే గ్యాలరీ వాక్‌ చేశానన్నారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. పట్టిసీమ పూర్తిచేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామన్నవాళ్లు… 10 నెలల్లో పూర్తిచేస్తే ఎవరూ మాట్లాడటంలేదని విమర్శించారు. వంశధార-నాగావళి, కృష్ణా-పెన్నాను అనుసంధానం చేసే..మహాసంగ్రామాన్ని చేపట్టామని భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. పోలవరం ప్రాజెక్టును అందరూ సందర్శించాలని…కట్టేటప్పుడు చూస్తేనే అవగాహన వస్తుందన్నారు.

జలాశయం నిండి, అదనంగా వచ్చే వరద నీటిని గేట్ల ద్వారా నది దిగువకు విడుదలచేయడానికి ఉపయోగపడే నిర్మాణమే స్పిల్‌వే. స్పీల్‌వేలో అంతర్భాగంగా నిర్మించే గ్యాలరీతో నాలుగు రకాల ప్రయోజనాలు ఉంటాయి. జలాశయంలోని నిల్వవుండే నీరు భూమి అడుగు నుండి డ్యాం మీద కలిగించే ఒత్తిడిని తగ్గించడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. అలాగే కాంక్రీట్ నిర్మాణం నుండి చెమ్మ రూపంలో వచ్చే ఊట నీటిని బయటకు తోడటానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. డ్యాం భద్రతను తనిఖీచేయడానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. ఈ విధమైన గ్యాలరీలు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో కూడా నిర్మించారు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు… ఇందిరాగాంధీ గ్యాలరీ వాక్ చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close