చంద్రబాబు ఫ్యామిలీ ‘ఒరిజినల్’ ఆస్తులజాబితా విడుదల

హైదరాబాద్: నారా లోకేష్ మొన్న చంద్రబాబునాయుడు కుటుంబంలోని సభ్యుల ఆస్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రు.42.4 లక్షలు, భువనేశ్వరికి రు.33 కోట్లు, తనకు రు.7.67 కోట్లు, తన భార్య బ్రాహ్మణికి రు.4.77 కోట్లు ఉన్నాయని లోకేష్ ఆ రోజు మీడియా సమావేశంలో తెలిపారు. ఇంతకంటే తమకు ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే నిరూపించినవారికే ఆ ఆస్తులను రాసిస్తామని లోకేష్ సవాల్ విసిరారు. తాము ఐదేళ్ళనుంచి ఈ సవాల్ విసురుతున్నామని, ఎవరూ ఇంతవరకు ముందుకు రాలేదని గర్వంగా చెప్పారు. అయితే ఇవాళ ఒకరు ఆ సవాల్‌కు ప్రతిస్పందించారు. ఆమె మరెవరో కాదు. లోకేష్ తాత ఎన్‌టీఆర్‌కు రెండో భార్య అయిన లక్ష్మీ పార్వతి.

లోకేష్ విడుదల చేసిన ఆస్తుల జాబితాలో ప్రతిఒక్క ఆస్తికీ లోకేష్ కట్టిన విలువకు పక్కన అసలు విలువను పేర్కొంటూ లక్ష్మీ పార్వతి రూపొందించిన ఒక కొత్త జాబితాను సాక్షి పత్రిక ఇవాళ ప్రచురించింది. లోకేష్ అబద్ధాలలో తండ్రిని మించిపోయారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ చెప్పిన ప్రకారం కుటుంబం మొత్తం ఆస్తి దాదాపు రు.46.5 కోట్లు అని, అయితే వారికి హైదరాబాద్ శివార్లలోని మదీనాగూడలో ఉన్న పదెకరాల భూమి విలువే రు.200 కోట్లు పైనే ఉంటుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో చంద్రబాబు పేరుమీద ఉన్న ఇల్లు విలువను లోకేష్ రు.23.20 లక్షలుగా లెక్కగట్టగా, లక్ష్మీపార్వతి దానిని రు.32 కోట్లుగా లెక్కగట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవనంకూడా చంద్రబాబు కుటుంబంకిందే ఉందని తెలిపారు. చంద్రబాబు ఆస్తులపై దాదాపు దశాబ్దం క్రితమే తాను ఏసీబీకి తాను ఫిర్యాదు చేశానని, ఆ కేసును నీరుగార్చారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
సాక్షిలో లక్ష్మీపార్వతి లేఖ

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close