ఈవీఎంలపై రచ్చ..! ఏపీలో ఏ ప్రచారం జరిగినా… చంద్రబాబుకు కావాల్సింది ఢిల్లీ రాజకీయమే…!

ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయింది. దాదాపుగా సగం పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నానికి పోలింగ్ ప్రారంభం.. .సాంకేతిక సమస్యలు.. గందరోళం మధ్య… పోలింగ్ జరిగింది. ఓటర్ల పట్టుదలతో… పోలింగ్ శాతం.. అంచనాలకు అందని విధంగా ఉంది. ఇది… తమకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకుని తీరాల్సిందేనన్న కసితో… ప్రజలు ఓట్లేశారు. అంత వరకూ.. ఓకే. ఇప్పుడు.. ఎవరు ఏం చేసినా…. ఈవీఎంలలో నిక్షిప్తం అయినా తీర్పు మారదు. చంద్రబాబు ఎన్ని పోరాటాలు చేసినా… ఈసీ చలించదు. కానీ చంద్రబాబు.. ఈవీఎంలపై అదే పనిగా అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందని…. వైసీపీ నేతలు ఆరోపించడం ప్రారంభించారు. పోలింగ్ సరళి చూస్తే.. టీడీపీకి అనుకూలంగా ఉందని.. పార్టీలకు అతీతంగా … విశ్లేషకులు ఓ అంచనాకు వచ్చారు. కానీ… వైసీపీలో మాత్రం.. చంద్రబాబు తీరే ధైర్యాన్ని నింపుతోంది.

చంద్రబాబు.. అంతగా… ఈవీఎంలపై భయంతో ఉన్నారంటే.. ఆయన ఓడిపోతున్నారని.. నమ్ముతున్నారు. అందుకే… రెండు, మూడు రోజులుగా.. వైసీపీ నేతలు.. గెలవబోయేది తామేనని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాం చేసుకోవడం వల్ల వైసీపీకి మనోధైర్యం వస్తుంది కానీ.. కొత్తగా.. ప్రజాతీర్పు మారే అవకాశం ఉండదు. కానీ చంద్రబాబు.. ఏపీలో ఏ ప్రచారం జరిగినా.. తీర్పు నిక్షిప్తమయింది కాబట్టి… బిందాస్ గా…. ఏపీలో ఎన్నికల నిర్వహణ తీరును జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. అదే తరహాలో.. దేశం మొత్తం చేసి.. ప్రజాతీర్పును…మోడీ కాలరాయబోతున్నారని చెబుతున్నారు. అంటే.. ఇప్పుడు చంద్రబాబుకు.. ఏపీలో ఎలాంటి ప్రచారం జరిగినా నష్టం లేదు. కానీ.. అదే ప్రచారం.. జాతీయ స్థాయిలో జరిగితే మోడీకి నష్టం.

తనకు ఎలాంటి లాభనష్టాలు లేనప్పుడు… మోడీకి కచ్చితంగా నష్టం జరుగుతుందనుకున్నప్పుడు.. చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తారు.. ?. ఇప్పుడు అదే చేస్తున్నారు… మే 23న కౌంటింగ్ జరుగుతుంది. అప్పటి వరకూ.. ప్రజలు ఏం మాట్లాడుకున్నా… అంతా… గాసిప్సే. తీర్పు మారే అవకాశం కూడా లేదు. అందుకే.. చంద్రబాబు ఈవీఎంలపై ఆరోపణలో ఢిల్లీపై దండెత్తారు. కానీ.. ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం. .. అవసరం లేని ఆనందం తెచ్చుకుని సంతోష పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close