చంద్రబాబు కుటుంబాన్ని అడ్డుకున్నది ఎవ్వరు?

నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి.. పదేళ్లపాటూ ఆ రాష్ట్రాన్ని హైదరాబాదు నగరం నుంచి పరిపాలించగల అవకాశం పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆయన దానిని తోసిరాజని, అమరావతికి వలసవెళ్లిపోయారు. అక్కడ క్యాంపు కార్యాలయంలో నివాసం ఉంటూ ‘మన రాష్ట్రం నుంచే మన పాలన’ అనే నినాదాన్ని పాటిస్తున్నారు. అందుకు ఆయనను అభినందించే వారు కూడా ఉన్నారు. అయితే కారణాలు తెలియదు గానీ.. ఆయన కుటుంబం మాత్రం ఆయన వెంట వెళ్లలేదు. అయితే కుటుంబం అమరావతికి వెళ్లకపోవడానికి కారణాలు ఏమిటి? నారా చంద్రబాబు కుటుంబం ఆయన వెంట వెళ్లకుండా ఎవరైనా అడ్డుకున్నారా? ఆ కుట్ర చేసినది ఎవరు? అనే సందేహాలు ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నాయి. ఈ సందేహాలకు కారణం మరెవ్వరో కాదు.. స్వయంగా చంద్రబాబు కొడుకు లోకేషే కావడం విశేషం.

విశాఖ పార్టీ ఆఫీసు శంకు స్థాపన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లోకేష్‌ చాలా చిత్రమైన అంశాన్ని ప్రస్తావించారు. తన తండ్రి చంద్రబాబునాయుడు, హైదరాబాదుకు వచ్చిన సందర్భంలో.. తన కొడుకు (అంటే చంద్రబాబు మనవడు దేవాంశ్‌)ను ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తే వాడు దగ్గరకు వెళ్లకుండా బేర్‌ మంటున్నాడంటూ లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం హైదరాబాదులో, తాతయ్య అమరావతిలో.. ఇలా ఉండడం వల్ల మనవడితో అనుబంధం ఏర్పడకుండా పోతున్నదని లోకేష్‌ ఆవేదన వెలిబుచ్చారు. సభలో ఉన్న తాత, అవ్వ లందరూ దీన్ని గురించి ఆలోచించాలని ఆయన పిలుపు ఇచ్చాడు.

ఇటీవల సుజనాచౌదరి ఇంట్లో పెళ్లికని హైదరాబాదు వెళ్లినప్పుడు, చంద్రబాబు దగ్గరకు తీసుకోబోతే మనవడు రాలేదుట. ఏడ్చాడుట. దానికి లోకేష్‌ చెప్పిన భాష్యం ఇది. తద్వారా.. బహుశా చంద్రబాబునాయుడు చాలా త్యాగం చేస్తున్నారని, రాష్ట్రం కోసం కుటుంబాన్ని వదలి పనిచేస్తున్నారని.. ఆయనంతటి త్యాగపురుషుడు మరొకరు లేరని చెప్పడం లోకేష్‌ ఉద్దేశం కావొచ్చు. అయితే ఆయన మాటలను బట్టి సామాన్యులకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. నారా చంద్రబాబునాయుడు అమరావతికి వెళ్లిపోయిన తర్వాత.. ఆయన కుటుంబం ఇంకా హైదరాబాదులో ఎందుకు ఉంటున్నట్లు? వారు అమరావతికి వెళ్లడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అందరూ అక్కడకు వెళ్లిపోతే ఎంచక్కా తాతా మనవడూ మధ్య అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది కద! కుటుంబం వెళ్లకుండా వారిని ఎవ్వరైనా అడ్డుకుంటున్నారా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

వారిలో మరో సందేహం కూడా ఉంది. చంద్రబాబు రాష్ట్రం కోసం అమరావతిలో ఉన్నాడేమో గానీ, ఆయన కుటుంబం మొత్తం వ్యాపారాలు చూసుకోవడం కోసం హైదరాబాదులో ఉంటున్నారు. వాళ్ల వ్యాపారాలు వాళ్లు చూసుకోవడానికి హైదరాబాదునుంచి కదలకుండా.. దాన్ని కూడా త్యాగంగానే భావించాలని వారు కోరుకుంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. లోకేష్‌ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని… ఏదో చెప్పబోయి, మరేదో చెప్పేసి.. తమ వ్యాపారం కోసం తాము హైదరాబాదులో నివాసం ఉంటే, దాన్ని త్యాగంగా రంగు పులమదలచుకుని చిత్రమైన చిన్నెలు పోతున్నారని.. ఇలాంటి వాటివల్ల తండ్రీ కొడుకులు ఇద్దరూ నవ్వులపాలు కావడమే తప్ప మరో ప్రయోజనం ఉండకపోవచ్చునని పలువురు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close