మానవవనరులపై ఆరో శ్వేతపత్రం..! ఏపీలో జనాభా పెరగాల్సి ఉందన్న చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల అభివృద్ధికి నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితాలిచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మానవవనరుల అభివృద్ధిపై ఆయన ఆరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి 11 ప్రైవేట్‌ యూనివర్సిటీలు తీసుకొచ్చామని.. వీటి ద్వారారూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. విదేశీ సంస్థల ద్వారా స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. 16 వర్సిటీలకు గాను 10 విశ్వవిద్యాలయాలకు న్యాక్‌ గుర్తింపు రావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.
7అకాడమీలు, తెలుగు భాషాభివృద్ది సంస్థ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు . మానవవనరులు సద్వినియోగం చేసుకోకుంటే సమాజం ముందుకెళ్లదన్నారు. మానవవనరుల విలువను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు తీసుకురావడం వల్లే. హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీలో విద్యాసంస్థలు లేని లోటు కనిపించిందని.. అందుకే నాలుగున్నరేళ్లలో విద్యాభివృద్ధిపై దృష్టిపెట్టామన్నారు. రాష్ట్రంలో నాలెడ్జ్‌ మిషన్‌ ఏర్పాటు చేసి… ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జ్ఞానభేరి వంటి కార్యక్రమాలతో చైతన్యం తెస్తున్నామని గుర్తు చేశారు. ప్రతిభగల విద్యార్థులను ప్రొత్సహించేందుకు.. విద్యార్ధులకు ప్రతిభ అవార్డులు ఇస్తున్నామన్నారు. పాఠశాలల్లో 1,217 వర్చువల్ క్లాస్‌లు..3,640 డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని.. కొత్తగా యోగా, కూచిపూడి క్లాసులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీగోడలు నిర్మించామని ప్రకటించారు.అన్ని కాలేజీలకు వైఫై సదుపాయం కల్పించి … 46 డిగ్రీ కాలేజీలు, 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని … దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్యరంగంలో 24 పథకాలు అమలులో ఉన్నాయన్నారు.

ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష..ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స పథకాలు అమలు జరుగుతున్నాయని.. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్‌తో పాటు రూ.2,500 పింఛన్ ఇస్తున్నామన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని ఏపీలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానంపై నిబంధనను తొలగిస్తామని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close