నేడు బెంగాల్‌కు చంద్రబాబు..! బీజేపీయేతర కూటమికి ముందడుగు..!

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా.. కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా… చంద్రబాబు ఈ రోజు… కోల్‌కతా వెళ్లి సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఈ నెల ఇరవై రెండున ఢిల్లీలో కూటమి పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అంగీకరించేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే అంగీకరించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూటమి కట్టి… బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందని… ప్రజలకు తెలియజెప్పాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

కొన్ని ప్రాంతీయ పార్టీలు… కాంగ్రెస్‌ కలవడానికి సిద్ధంగా లేవు. తృణమూల్ లాంటి పార్టీలు కాంగ్రెస్‌తో పాటు… సీపీఎంలాంటి పార్టీలతో కలిసి నడుస్తాయా అన్నది సందేహం. దీనికి కారణం వారు ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటున్నారు. బీజేపీని మాత్రం ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పార్టీలను కలపడం… టీడీపీ అధినేతకు అత్యంత సవాల్‌తో కూడిన అంశంగా మారనుంది. ఇలాంటి సవాల్ మొదటిసారిగా చంద్రబాబు బెంగాల్ విషయంలో ఎదుర్కోబోతున్నారు. అయితే మమతా బెనర్జీ.. బెంగాల్‌కు సంబంధించిన వరకు.. పక్కన పెట్టేసి.. జాతీయ రాజకీయాల్లో మాత్రం.. కూటమిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. 22వ తేదీన సమావేశానికి రావడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.

నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే సలహాను…మమతా బెనర్జీనే మొదట చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నారు కూడా. జనవరిలో కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీని ఆమె…బీజేపీయేతర కూటమి బలప్రదర్శనగా మార్చాలనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. కూటమిలో బాగస్వామ్య పక్షంగా ఉండనున్న సిపిఎంకు .. తృణమూల్ కాంగ్రెస్ కు బద్ద వైరం ఉంది. ఇటువంటి భిన్న స్వభావాలు కలిగిన వారిని కూటమిలోకి తీసుకువస్తే వీరు కలిసి ఉండటం కష్టమవుతుందని భావన ఉంది. వీరిరువురిని అనుసంధానం చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. బెంగాల్‌లో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నందున.. కలసి కట్టుగా పోరాడటంలో తప్పు లేదన్న ఆ రెండు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయవచ్చు.

22వ తేదిన ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు చంద్రబాబు వైపు నుంచి నేతలందరికీ ఫోన్ లు వెలుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్రపతి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఎటువంటి స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close