నేడు బెంగాల్‌కు చంద్రబాబు..! బీజేపీయేతర కూటమికి ముందడుగు..!

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా.. కూటమి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా… చంద్రబాబు ఈ రోజు… కోల్‌కతా వెళ్లి సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఈ నెల ఇరవై రెండున ఢిల్లీలో కూటమి పార్టీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అంగీకరించేందుకు మమతా బెనర్జీ ఇప్పటికే అంగీకరించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను కూటమి కట్టి… బీజేపీకి ప్రత్యామ్నాయం ఉందని… ప్రజలకు తెలియజెప్పాలని చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.

కొన్ని ప్రాంతీయ పార్టీలు… కాంగ్రెస్‌ కలవడానికి సిద్ధంగా లేవు. తృణమూల్ లాంటి పార్టీలు కాంగ్రెస్‌తో పాటు… సీపీఎంలాంటి పార్టీలతో కలిసి నడుస్తాయా అన్నది సందేహం. దీనికి కారణం వారు ఒకే రాష్ట్రంలో ప్రత్యర్థులుగా ఉంటున్నారు. బీజేపీని మాత్రం ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పార్టీలను కలపడం… టీడీపీ అధినేతకు అత్యంత సవాల్‌తో కూడిన అంశంగా మారనుంది. ఇలాంటి సవాల్ మొదటిసారిగా చంద్రబాబు బెంగాల్ విషయంలో ఎదుర్కోబోతున్నారు. అయితే మమతా బెనర్జీ.. బెంగాల్‌కు సంబంధించిన వరకు.. పక్కన పెట్టేసి.. జాతీయ రాజకీయాల్లో మాత్రం.. కూటమిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. 22వ తేదీన సమావేశానికి రావడానికి ఇప్పటికే అంగీకారం తెలిపారు.

నిజానికి బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నింటినీ ఏకం చేయాలనే సలహాను…మమతా బెనర్జీనే మొదట చంద్రబాబుకు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతు పలుకుతున్నారు కూడా. జనవరిలో కోల్‌కతాలో నిర్వహించబోయే ర్యాలీని ఆమె…బీజేపీయేతర కూటమి బలప్రదర్శనగా మార్చాలనుకుంటున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా.. కూటమిలో బాగస్వామ్య పక్షంగా ఉండనున్న సిపిఎంకు .. తృణమూల్ కాంగ్రెస్ కు బద్ద వైరం ఉంది. ఇటువంటి భిన్న స్వభావాలు కలిగిన వారిని కూటమిలోకి తీసుకువస్తే వీరు కలిసి ఉండటం కష్టమవుతుందని భావన ఉంది. వీరిరువురిని అనుసంధానం చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. బెంగాల్‌లో బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నందున.. కలసి కట్టుగా పోరాడటంలో తప్పు లేదన్న ఆ రెండు పార్టీలకు సర్ది చెప్పే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయవచ్చు.

22వ తేదిన ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే అటు కాంగ్రెస్ నుంచి, ఇటు చంద్రబాబు వైపు నుంచి నేతలందరికీ ఫోన్ లు వెలుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న సమావేశంలో దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న వైనం, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ దాడులపై రాష్ట్రపతి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు. ఎటువంటి స్పందన రాని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవసరమైన కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close