“చేదోడు” లబ్దిదారులు నియోజకవర్గానికి 1500 మంది కూడా లేరేంటి..?

జగనన్న చేదోడ పథకానికి అతి తక్కువగా లబ్దిదారులను ఎంపి చేయడంపై.. తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించింది. పాదయాత్రలో చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి… రజకులు, నాయీ బ్రహ్మణులు, టైలర్లకు ఏడాదికి రూ. పదివేలు సాయం చేసేందుకు జగనన్న చేదోడు అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజే ఆ పథకం నిధులు లబ్దిదారుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. అయితే.. మొత్తంగా.. రెండున్నర లక్షల మంది లబ్దిదారులు మాత్రమే ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంపై… టీడీపీ మండిపడింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… ముఖ్యమంత్రి జగన్మాయ చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 5 లక్షల 50 వేల మంది నాయిబ్రాహ్మణులు ఉన్నారు. నాయీ బ్రాహ్మణలు ప్రతీ వీధిలోనూ ఉంటారు. ప్రతీ ఊరులోనూ ఉంటారు. అయితే.. కేవలం 38 వేల మందికే ఆర్థిక సాయం చేసింది. దీన్నే చంద్రబాబు ప్రశ్నించారు. యటం ఏమిటని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 38 వేల మంది నాయీ బ్రాహ్మణలకు సాయం పంపిణీచ ేయడం అంటే… ఒక్కో నియోజకర్గంలో అర్హులు సగటున 210 మంది మాత్రమే. దీనిపై టీడీపీనే తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అలాగే.. రాష్ట్రంలో 13 లక్షల మంది టైలర్లు ఉన్నారని.. అందులో లక్షా 25 వేల మందికి ఆర్థిక సాయం చేస్తున్నారని.. నియోజకవర్గానికి సగటున ఐదు వందల మంది టైలర్లకు కూడా సాయం చేయడం లేదని మండిపడ్డారు. రజకులు 15 లక్షల మంది ఉంటే 82 వేల మందికే సాయం చేయటం సబబా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అతి తక్కువ మందికి సాయం చేయడంమే కాకుండా.. బీసీ సబ్ ప్లాన్ ప్రకారం.. వారికి వెళ్లాల్సిన వేల కోట్లను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను 4 వేల కోట్లు దారి మళ్లించారని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రభుత్వం పథకాల లబ్దిదారులను మరీ తక్కువగా చేయడానికి.. అనేక రకాల నిబంధనలు పెడుతోందన్న విమర్శలు.. ఆయా పథకాలను ఆశిస్తున్న వారి నుంచి కూడా వస్తున్నాయి. సొంత దుకాణం ఉండాలి… కార్మిక శాఖలో రిజిస్టర్ చేసుకోవాలంటూ.. అర్థం పర్థం లేని నిబంధనలు పెట్టడంతో.. కనీసం ఉన్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లలలో పది శాతానికి కూడా పథకం అందని పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close