నేను కాదు మోడీనే యూటర్న్ తీసుకున్నారు: చంద్రబాబు

యూటర్న్ తనది కాదని.. ప్రధానమంత్రి నరేంద్రమోడీదేనని… ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన పార్టీల కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకే అవిశ్వాసం పెట్టామని.. మెజారిటీకి, మొరాలిటీకి మధ్య పోరాటం జరిగిందన్నారు. ఏపీకి హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారన్నారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని
తిరుమల వెంకన్న సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి ఇంకా ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారని అన్నింటిలోనూ యూటర్న్ తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజధానికి కేంద్రం రూ. 1500 కోట్లే ఇచ్చిందని.. ఆ డబ్బుతో కేబుల్‌ వర్క్‌ కూడా పూర్తి కాదన్నారు. అమరావతి అభివృద్ధి చెందితే కేంద్రానికే లాభమని గుర్తు చేశారు. ఏపీకి నిధులు ఇచ్చేందుకే మీకు నిబంధనలు అడ్డువస్తున్నాయా? అన్ని నిలదీశారు.

విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని పలుమార్లు కోరినా స్పందన రాలేదన్నారు. 29సార్లు నేను స్వయంగా ఢిల్లీ వెళ్లానన్నారు. ఏపీ ప్రజలది కష్టపడే తత్వమన్న చంద్రబాబు కేంద్రం తీరుతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ తలుపులు మూసి విభజన బిల్లు పాస్‌ చేశారని…మోదీ అన్నారు…మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శిస్తూ… మీరు చేస్తున్నదేమిటని మండిపడ్డారు. ఏపీకి న్యాయం జరుగుతుందనే ఎన్డీఏలో చేరాం తప్ప రాజకీయ అవసరాల కోసం కాదన్నారు.

కేసీఆర్ తో పోలుస్తూ… తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మోదీ తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మోడీ వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. అవినీతిని సహించబోమంటూనే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులకు టికెట్లు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ ట్రాప్‌లో చంద్రబాబు పడ్డారన్న మోడీ వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. నిన్న జగన్‌ కోర్టులో ఉంటే మా ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడారన్నారు. ఢిల్లీలో చంద్రబాబు వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి..కృతజ్ఞతలు చెప్పడంతో పాటు.. భవిష్యత్ కార్యాచరణను కూడా నిర్ణయించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close