త్వరలో ‘సాక్షి’ స్వాధీనం: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షి దినపత్రికను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ అవినీతి పత్రిక ఎటాచ్‌మెంట్‌లో ఉందని, దానిని త్వరలో స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అది ప్రజల ఆస్తి అని, ప్రజలకు చెందుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, అవినీతి ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లు ఢిల్లీలో ఆమోదం పొందిన వెంటనే ఎటాచ్‌మెంట్‌లో ఉండే ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. సత్యం ఆస్తులు జప్తు చేశాక అవి ప్రభుత్వంవద్దకు వెళ్ళాయని గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను తీసుకుంటామని, తన కోసం కాదని, ప్రజలకోసమని చెప్పారు. ఈ విషయాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టామని అన్నారు. ప్రత్యేక కోర్టునూ ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతపూర్ జిల్లా లేపాక్షి సెజ్ భూములనూ వదలబోమని, గత ప్రభుత్వం అక్కడ 15 వేల ఎకరాల భూమిని అక్రమంగా ధారాదత్తం చేసిందని ఆరోపించారు. అవినీతికి పాల్పడేవాళ్ళా మమ్మల్ని విమర్శించేదంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం పెంపు, ఇతర విషయాల్లో తనపైన, తన కుమారుడిపైన సాక్షిలో వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. తనకు అడ్డగోలుగా సంపాదించాల్సిన కక్కుర్తి తనకు లేదని చెప్పారు. జగన్ తన ఆస్తుల లెక్క ఎందుకు చెప్పటంలేదని ప్రశ్నించారు. తన భార్య భువనేశ్వరి – తండ్రి, భర్త ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసినాకూడా – ఏనాడూ ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. ఆమె కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేయటం వల్ల హెరిటేజ్ సంస్థ ఈ ఏడాది రు.100 కోట్ల మేర లాభాలను ఆర్జించే స్థాయికి చేరుకుందని అన్నారు. తాను గడియారం, ఉంగరం వంటివి ధరించనని, అన్నింటికీ దూరంగా ఉండాల్సిన అవసరం తనకేమిటని అడిగారు. తానీ త్యాగం చేస్తున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికే తప్ప, ఆస్తులు పెంచుకోటడానికి కాదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close