గ్రేటర్ ఎన్నికలలో తెదేపాను దెబ్బ తీసేందుకే తునిలో విద్వంసం?

రేపు అంటే ఫిబ్రవరి రెండవ తేదీన జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు తెదేపా, బీజేపీలకు చాలా కీలకమయినవి. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణాలో ఆ రెండు పార్టీల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో తెదేపా-బీజేపీ కూటమి విజయం సాధించినట్లయితే, తెలంగాణాలో ఆ రెండు పార్టీలు మళ్ళీ కోలుకోవచ్చును. ఒకవేళ వరంగల్ ఉపఎన్నికలలో మాదిరిగానే ఘోర పరాజయం పొందినట్లయితే, ఇక క్రమంగా తెలంగాణాలో తుడిచిపెట్టుకుపోవచ్చును. ఎందుకంటే తెదేపా-బీజేపీ కూటమికి మొదటి నుంచి హైదరాబాద్ జంట నగరాలపై మంచి పట్టు ఉంది. జంటనగరాలపై తెరాసకు అంతగా పట్టు లేదు. కనుక అటువంటి చోట కూడా అవి తెరాస చేతిలో ఓడిపోయినట్లయితే ఇక అవి ప్రజాధారణ కోల్పోయినట్లే భావించవలసి ఉంటుంది. అది వాటి పతనానికి దారి తీయవచ్చును. అందుకే వరంగల్ ఉపఎన్నికల ప్రచారానికి వెళ్ళని చంద్రబాబు నాయుడు గ్రేటర్ ప్రచారానికి వెళ్ళారని చెప్పవచ్చును.

కీలకమయిన ఇటువంటి సమయంలో ఆయన దృష్టిని మరల్చడానికే తునిలో విద్వంసానికి కుట్ర జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం గ్రేటర్ పరిధిలో ఉన్న ఆంధ్రా ఓటర్లపై కూడా ఎంతో కొంత పడే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కూడా రాజకీయంగా తెదేపాను దెబ్బ తీయడానికే ఈ బారీ కుట్ర జరిగి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తెదేపా నష్టపోవాలని కోరుకొంటున్నది వైకాపాయే కనుక ఆ పార్టీయే ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుమానం వ్యక్తం చేసారనుకోవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close