వేరీజ్ వేల్యూస్ అని నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. బుధవారం ఉదయం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ ఈ వెంటుని కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సగటు మనిషి లో వుండే నిస్సహాయ తాత్వికతను ప్రదర్శించారు.
ఓటు బ్యాంక్ అంతా డబ్బుతోనే నడుస్తూంది. డబ్బు పంచి ఓట్లు వేయించుకున్న నాయకుడు అంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించుకోవటమే తప్ప మెరుగైన పాలన అందించలేరు. ప్రభుత్వం ఎంత చేసినా ఓట్లు వేసేముందు మాత్రం ఐదు వందల కోసమే చూస్తున్నారు. ఊర్లలో నీరు లేకపోతే నీళ్లిచ్చి, కరెంటు లేకపోతే కరెంటిచ్చి, గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి… వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అన్ని చేసాక లాస్టులో 500 రూపాయలు ఇస్తే… అతను డబ్బిచ్చిన వాళ్లకే ఓటేస్తాడు. ఇదెక్కడి న్యాయం? ఆ ఐదొందలకు, వెయ్యికి… ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులేదు కాబట్టి, రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలి కాబట్టి, ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూస్ అని చంద్రబాబు ప్రశ్నించారు.
దేశంలో బ్లాక్ మనీని రద్దు చేయాల్సిన అవుసరముందన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బ్లాక్ మనీని రద్దు చేయాలంటే రూ.500,1000 నోట్లను రద్దు చేయాల్సిందేనన్నారు.