పవన్, చంద్రబాబు దయ్యాలు : సీఎం జగన్

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. గతంలో ఏపీని దోచుకుని అప్పుల పాలు చేశారని విమర్శించారు. నర్సరావుపేటలో వాలంటీర్లకు సన్మానాలు ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని విపక్షాలపై విమర్శలు చేయడానికే ఎక్కువ మసయం కేటాయించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓ దొంగల ముఠా అన్నారు. వారు హైదరాబాద్‌లో మకాం వేసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. తాను మారీచులు.. రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ప్రదానమంత్రి తనకు క్లాస్ పీకారని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని.. తాను ప్రధానమంత్రితో భేటీ అయి నసమయంలో గదిలో తాను, ప్రధానమంత్రి మాత్రమే ఉన్నామన్నారు. ఆ విషయాలు బయటకు తెలియవన్నారు. అందుకే… ఆ మీడియా సంస్థలు చెప్పే వాటిని నమ్మనే నమ్మవద్దని ప్రజల్ని కోరారు. ఇటీవలి కాలంలో విపక్షాలు అప్పులతో పాటు పాలనా వైఫల్యాలపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యతిరేకత ఓట్లు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ నేతర అరాచకాలు చర్చనీయాంశమవుతున్నాయి ఈ క్రమంలో వారి విమర్శలకు ముఖ్యమంత్రి సమాధానం తిట్ల రూపంలో వ్చచింది.

అంతకు ముందు వాలంటీర్ల సేవలను జగన్ ప్రస్తుతించారు. వాలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. అవినీతికి ఆస్కారం లేకుండా పథకాలు అందడానికి వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని వారంతా గొప్పగా పని చేస్తున్నారని కీర్తించారు. మొత్తంగా సీఎం జగన్ రాను రాను అసహనానికి గురవుతున్నారన్న అభిప్రాయం తాజా స్పీచ్ ఉన్న వారికి అర్థమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close