ఇక మెగాస్టార్‌ ఇలా సెటిల్‌ అవ్వబోతున్నాడా? . ఏంటి..?

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా గురించి ఆమధ్య మీడియా విపరీతంగా హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం చేస్తూనే వుంది . అతను మళ్ళీ సినిమా చెయ్యాలనే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడో లేదో తెలీదుగానీ మీడియా మాత్రం చాలా సీరియస్‌గా తీసుకొని డైరెక్టర్‌ ఎవరు, హీరోయిన్‌ ఎవరు వంటి విషయాల్ని కన్‌ఫర్మ్‌ చేసేసింది. అయితే చివరికి మంచి కథ, డైరెక్టర్‌ కుదిరితే తప్పకుండా 150వ సినిమా చేస్తానని, రామ్‌చరణ్‌ ఆ చిత్రాన్ని నిర్మిస్తాడని మెగాస్టార్‌ ప్రకటించాడు. ఆమధ్య పూరి జగన్నాథ్‌ డైరెక్టర్‌గా కన్‌ఫర్మ్‌ అయ్యాడని, ఫస్ట్‌ హాఫ్‌ కూడా ఓకే అయిందనే వార్తలు కూడా వచ్చాయి. చివరికి కథ నచ్చకపోవడం వల్ల పూరి జగన్నాథ్‌ని తప్పించారని తెలిసింది. తర్వాత వి.వి.వినాయక్‌ తెరపైకి వచ్చాడు. మెగాస్టార్‌ పుట్టినరోజైన ఆగస్ట్‌ 22న సినిమా ఎనౌన్స్‌ చేస్తారని అంతా ఎదురు చూశారు. కానీ, అక్కడ ఎలాంటి సౌండూ లేదు. దసరాకి మెగాస్టార్‌ శ్రీమతి సురేఖ 150వ సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్తుంది అన్నారు. అదీ జరగలేదు.

ఇదంతా చూస్తుంటే అసలు మెగాస్టార్‌కి మళ్ళీ హీరోగా నటించే ఆలోచన వుందా లేదా అనే డౌట్‌ అందరికీ కలుగుతోంది. ఎందుకంటే ఇటీవల రామ్‌చరణ్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బ్రూస్‌లీ’ చిత్రంలో మెగాస్టార్‌ నటించాడు. అయితే అది సినిమాకి ఉపయోగపడకపోగా మెగాస్టార్‌ గెటప్‌ని, పెర్‌ఫార్మెన్స్‌ని చూసిన అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. ఈ సినిమా తర్వాత 150వ సినిమా అనే టాపిక్‌ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు లేటెస్ట్‌గా పవన్‌కళ్యాణ్‌ చేస్తున్న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లో చిరంజీవి ఒక గెస్ట్‌ రోల్‌ చెయ్యబోతున్నాడని తెలిసింది. దీన్నిబట్టి చూస్తే ఇక చిరంజీవి మిగిలిన తన సినీ జీవితాన్ని ఇలా గెస్ట్‌ రోల్స్‌ చేసుకుంటూ గడిపేస్తాడా? అనే డౌట్‌ కూడా వస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరి సినిమాలో ఇలా గెస్ట్‌ రోల్స్‌ చేసుకుంటూ వెళ్ళిపోతాడా? మెగాస్టార్‌ ఇక ఇలా సెటిల్‌ అవ్వాలని డిసైడ్‌ అయ్యాడా? అనే డౌట్‌ అభిమానులకు కలుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close