కాపు కార్పొరేషన్ పై తన ముద్ర కోసం చిరంజీవి ఆరాటం

కాపు కార్పొరేషన్ ద్వారా వీలైనంత మైలేజి సంపాదించాలని ఒకవైపు చంద్రబాబు అరాటపడిపోతున్నారు. మరోకవైపు తన మనిషిని నియమించలేదని ముద్రగడ చెలరేగుతున్నారు. ఇంకోకవైపు తన మనుషులచేతికే కార్పొరేషన్ పగ్గాలు రావాలని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

కాపు కార్పొరేషన్ అంటే నాయకులూ అందరికీ ఇప్పుడు ఆశలు పెరిగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల కేటాయింపులు కూడా పొందిన ఈ కార్పొరేషన్ కు ఎండి నియామకం జరగాల్సి ఉంది. సమర్ధుడైన గ్రూప్ 1 స్థాయి అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలకమైన ఆ పదవి కోసం పలువురు పైరవీలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో కీలకంగా లేకపోయినప్పటికీ ఎంపీ చిరంజీవి కూడా దీని కోసం తన మనిషిని ఎండీ చేయడానికి ఆశ పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం అయన మంత్రి గంట శ్రీనివాసరావు ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి కి సన్నిహితుడైన ఒక అధికారి గతంలో అయన కేంద్ర మంత్రి గా ఉన్న సమయంలో అయన పేషీలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆ అధికారి రాష్ట్ర సర్వీసులోనే ఉన్నారు. ఆయనను కాపు కార్పొరేషన్ ఎండి చేయాలని చిరు అనుకుంటున్నారట. పుష్కలంగా నిధులు ఉండే ఈ కార్పొరేషన్ పదవి అంటే ఆ వర్గంలో పట్టు సాధించడానికి ఉపయోగపడుతుందని అయన ఆలోచన కావచ్చు. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దృష్టి మరో అధికారి మీద ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయన గతంలో వట్టి వసంత కుమార్ మంత్రి గా ఉండగా అయన వద్ద పని చేసారు. అయన నియామకం నేడో రేపో బయటకు వస్తుందని అనుకుంటున్నా తరుణంలో తాజాగా చిరు ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే కామెడీ ఏంటంటే.. చిరు పేషీ, వట్టి పేషీ లకు సంబంధించిన వారె తప్ప కాపు కార్పొరేషన్ కు ఎండి చేయడానికి టీడీపీ ముద్ర ఉన్న విశ్వసనీయమయిన అధికారి ఒక్కరైనా లేకుండా పోయారా అని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close