పదో తేదీన మరోసారి జగన్ -చిరు భేటీ !

చిరంజీవి – జగన్ మధ్య మరోసారి పదో తేదీన సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సారి ఒక్క చిరంజీవి మాత్రమే కాదు టాలీవుడ్‌కు చెందిన వివిధ వ్యాపార విభాగాల ప్రతినిధులతో కలిసి చిరంజీవి తాడేపల్లికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. వారందరితో జగన్ భేటీ అవుతారు. గత సమావేశంలో చిరంజీవి ఒక్కరే పాల్గొన్నారు. దీని వల్ల అది వ్యక్తిగత సమావేశం అన్న ప్రచారం అయింది. ఈ సారి అలాంటి అవకాశం లేకుండా టాలీవు్డ మొత్తానికి చర్చల్లో ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ విషయంపై స్పష్టత ఉండటంతోనే చిరంజీవి చాంబర్ పెద్దలతో కలిసి సమస్యలపై చర్చించాలని అనుకున్నారు. సోమవారం సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కీల‌క‌మైన స‌భ్యులు అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల మీటింగ్ నిర్వహించ‌డం లేద‌ని ఛాంబ‌ర్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. మంగళ, బుధవారాల్లో చర్చలు జరిపి ఓ ఎజెండా ఖరారు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఏపీలో టిక్కెట్ రేట్ల అంశానికి పరిష్కారం దొరుకుతుందని టాలీవుడ్ ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. హైకోర్టు సూచనలతో ఇప్పటికే ప్రభుత్వం నియమించిన కమిటీ చర్చలు జరుపుతోంది. టాలీవుడ్‌తో పాటు వివిధ విభాగాలకు చెందిన వారితో మూడు దఫాలుగా చర్చలు జరిపింది. పదో తేదీన హైకోర్టులో ఈ అంశంపై విచారణ కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి బృందంతో సమావేశం తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close