“చౌకీదార్ చోర్ హై” .. ఈ సారి అన్నది రాహుల్ కాదు..! శివసేన..!!

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకు అలుసుగా మారిపోతోంది. బీహార్‌లో ఆరు స్థానాలకు పరిమితమైన రామ్‌విలాస్ పాశ్వాన్ లాంటి పార్టీని బుజ్జగించి… ఎన్డీఏలో ఉండేలా చేసుకోవడానికి అమిత్ షా రెండు రోజుల పాటు కష్టపడ్డారు. అడిగినన్ని సీట్లు ఇచ్చి.. ఓ రాజ్యసభ స్థానం ఇస్తే కానీ.. పాశ్వాన్ అండ్ సన్ సంతృప్తి పడలేదు. ఎలాగోలా.. బీహార్‌లో సీట్ల సర్దుబాటు చేసుకున్నామనుకునేలోపు.. మహారాష్ట్రలో శివసేన కత్తి దూయడం ప్రారంభించింది. ఇప్పటికే… శివసేన ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. అయితే.. బీజేపీ మాత్రం కలసి పోటీ చేస్తామన్న నమ్మకంతో ఉంది. అందుకే శివసేన చీఫ్ ఉద్ధవ్ ధాకరే బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్నారు.

పార్లమెంట్‌లో రకరకాల సందర్భాల్లో మోడీ సర్కారుకు షాక్ ఇచ్చిన శివసేన ఇప్పుడు.. మహారాష్ట్రలోనూ ఇచ్చేందుకు సిద్ధమయింది. కేంద్రంతో పాటు.. మహారాష్ట్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్న శివసేన… పార్లమెంట్‌తో పాటు.. అసెంబ్లీ ఎన్నికలు కూడా… ఒకే సారి పెట్టాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. అదే సమయంలో రాహుల్ గాంధీపై … ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా… … “చౌకీదార్ చోర్ హై” అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఎత్తుకున్నారు. మహారాష్ట్రలో ఓ గ్రామానికి పార్టీ ప్రచారం కోసం వెళ్లిన ఉద్ధవ్… ఓ రైతును ఉద్దేశించి.. ” రోజులు మారిపోయాయి.. ఇప్పుడు రక్షణా ఉండేవాళ్లే దొంగలయ్యారని..” వ్యాఖ్యానించారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉద్ధవ్ వ్యాఖ్యలు బీజేపీలో మంట పుట్టిస్తున్నాయి. మిత్రపక్షంగా ఉండి.. అలా ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కానీ నోరెత్తలేని పరిస్థితి బీజేపీ నేతలది. ఎందుకుంటే.. శివసేన ఏమి విమర్శించినా సరే ఎవరూ నోరెత్త కూడదని.. అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. అలా ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే.. పొత్తు తెగిపోతుందని అమిత్ షా ఆందోళన. దీన్ని ఆసరాగా చేసుకుని… ఉద్ధవ్ థాకరే నేరుగా మోడీ మీదే గురి పెడుతున్నారు. శివసేనతో పొత్తు లేకపోతే..మహారాష్ట్రలోబీజేపీకి ఎన్ని సీట్లొస్తాయో.. అసలు వస్తాయో రావో అంచనా వేయడం కష్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే.. బీజేపీ ఉద్ధవ్ ఏమన్నా భరించాలని నిర్ణయించుకుంది. కానీ… శివసేన మాటలని వదిలి పెట్టదు. మేజర్ పార్టీగా మాహారాష్ట్రలో బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు ఇస్తేనే కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికి శివసేన చేస్తున్న డిమాండ్ ప్రకారం.. సిట్టింగ్ సీట్లు కూడా బీజేపీ వదులుకోవాల్సి ఉంటుంది. బీహార్ లో అదే జరిగింది. మరి మహారాష్ట్రలోనూ త్యాగం చేస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close