నేటి నుండి విశాఖ-ఐ.ఐ.ఎం. క్లాసులు మొదలు

విశాఖపట్నంలో స్థాపించబోతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ శిక్షణా తరగతులు ఈరోజు నుండి మొదలవబోతున్నాయి. ఆంద్ర విశ్వద్యాలయంలో ప్రాంగణంలోనే గల ‘ఆంధ్రా బ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ భవనం ఐ.ఐ.ఎం-విశాఖకు తాత్కాలిక క్యాంపస్ గా కేటాయించబడింది. దానిని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. తరువాత లాంచనంగా క్లాసులు మొదలవుతాయి. సెప్టెంబర్ 28నుండి రెగ్యులర్ క్లాసులు మొదలవుతాయి. తరగతులు నిర్వహణ, విద్యార్ధుల వసతి, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐ.ఐ.ఎం-విశాఖ మొదటి బ్యాచులో కేవలం 60 మందిని మాత్రమే చేర్చుకొన్నారు. ఐ.ఐ.ఎం-విశాఖకు రెండు లేదా మూడేళ్ళ పాటు ఐ.ఐ.ఎం.-బెంగళూరు మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. దాని ద్వారానే 60మంది విద్యార్ధులను ఎంపిక చేయబడ్డారు. ఈ విద్యాసంవత్సరంలో ఐ.ఐ.ఎం-బెంగళూరు అధ్యాపకులే విశాఖకు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇస్తారు.

విశాఖ శివార్లలో మధురవాడ సమీపంలో గల గంభీరం అనే గ్రామం వద్ద ఐ.ఐ.ఎం-విశాఖ నెలకొల్పబోతున్నారు. దీని శాశ్విత భవనాల నిర్మాణానికి మరొక రెండు మూడేళ్ళ సమయం పట్టవచ్చును. అంతవరకు సమయం వృధా చేయకుండా ఈవిద్యాసంవత్సరం నుండే ఆంద్ర విశ్వద్యాలయంలో తాత్కాలిక భవనంలో శిక్షణా తరగతులు మొదలుపెట్టేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close