కేసీఆర్ ఢిల్లీ టూర్ ..! సంచలనాలుంటాయా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ర చంద్రశేఖర్ రావు ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధానమంత్రి ఆపాయింట్‌మెంట్ కోసం ఆయన చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి నాలుగు రోజులు వెయిట్ చేసినా… మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో నిరాశగా తిరిగి వచ్చారు. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల సమావేశం పదహారో తేదీన జరగబోతున్న సమయంలో… ప్రధాని కార్యాలయం హఠాత్తుగా కేసీఆర్‌కు పదిహేనో తేదీ మధ్యాహ్నం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. ముస్లిం రిజర్వేషన్లతో పాటు జోన్ల అంశానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర సహా.. పలు అంశాలు.. కేంద్రం వద్ద పెడింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి కేసీఆర్ ప్రయత్నించే అవకాశం ఉంది. ఇదంతా అధికారికం. కానీ రాజకీయ పరంగానూ కొన్ని సంచలనాత్మక విషయాలపై.. కేసీఆర్ .. మోదీతో చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

ప్రధానమంత్రి ఆపాయింట్‌మెంట్ ఖరారు కాగానే కేసీఆర్ ముందుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. గవర్నర్ నరసింహన్‌తో సమావేశయ్యారు. ఇటీవల రాష్ట్రపతితో అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన గవర్నర్… నాలుగు రోజులు ఎదురు చూసి ప్రధానమంత్రిని కలిసి.. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై నివేదికలిచ్చి వచ్చారు. ఈ క్రమంలో.. నరసింహన్‌తో కేసీఆర్ భేటీ ఆసక్తి రేకేతిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలపై మోదీకి ఓ మాట చెబుతారని ప్రచారం జరుగుతోంది. కూటమిలో చేరేందుకు ఒక్క పార్టీ కూడా ఆసక్తి చూపించకపోవడంతో.. కేసీఆర్ కూడా లైట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ఏడాదిలో కేసీఆర్ రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎంత చాన్స్ ఉందో.. తీసుకోకపోవడానికి కూడా అంతే చాన్స్ ఉంది.

కేసీఆర్‌ తీసుకునే సంచలన నిర్ణయం ఏదైనా ఉందా అంటే… అది ఎన్డీఏలో చేరడం. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పుడు కేంద్రమంత్రులెవరూ లేరు. టీడీపీ మంత్రులు ఇద్దరూ రాజీనామాలు చేశారు. అంతకు ముందే దత్తాత్రేయను సాగనంపారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేసే యోచనలో నరేంద్రమోదీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌ ను కేబినెట్‌లోకి మోదీ అహ్వానించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. ఇప్పుడు బీజేపీకి కొత్త మిత్రులు కావాలి. కేసీఆర్ పెట్టుకున్న ఫెడరల్ ఫ్రంట్‌వైపు వచ్చే పార్టీలేవీ లేవు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల వరకూ కాపోయినా.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మంత్రి పదవులు ఇస్తే.. కొత్త మిత్రులు వస్తారని.. దూరంగా ఉన్నపార్టీల్లో ఆలోచన మొదలవుతుందన్న భావనలో బీజేపీ వర్గాలున్నాయి.

కొద్ది రోజుల నుంచి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ కూడా.. తెలంగాణలో టీఆర్ఎస్‌పై పోరాడుతున్నదేమీ లేదు. ఓ రకంగా అప్రకటిత మిత్రపక్షాలుగానే ఉన్నారు. కానీ బీజేపీతో ఎలాంటి సంబంధాలు పెట్టుకున్నా.. అది చాలా డేంజర్ అనే విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఒక వేళ పెట్టుకున్నా.. ఆ నిర్ణయాన్ని ఆయన జస్టిఫై చేసుకోగలరు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల రియాక్షన్స్ మాత్రం అంచనా వేయలేరు. అందుకే… కేసీఆర్ తటపటాయించే అవకాశం ఉంది. ఏ విధంగా చూసినా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఈ సారి కాస్తంత రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close