సహకరించుకొందాము రండి : కేసీఆర్

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి, చంద్రబాబు, కేసీఆర్ ముఖ్యమంత్రులయిన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ఘర్షించుకొన్నాయో అందరూ చూసారు. ఆ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అభివృద్ధిలో పోటీపడాలని చంద్రబాబు నాయుడు పదేపదే కేసీఆర్ కి విజ్ఞప్తి చేస్తుండేవారు కానీ కేసీఆర్ వాటిని పట్టించుకొనేవారు కాదు. నిత్యం ఏదో ఒక సమస్యని చూపిస్తూ చంద్రబాబు నాయుడుపై కత్తులు దూస్తూనే ఉండేవారు. ఓటుకి నోటు కేసుతో వారి మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకొంది. ఆశ్చర్యకరంగా అదే వారి మధ్య గొడవలకు ముగింపు కూడా పలికింది. చంద్రబాబు నాయుడు విజయవాడ తరలిపోవడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్రమంగా ఉద్రిక్తతలు తగ్గు ముఖం పట్టాయి. అదే సమయంలో తెలంగాణాలో తెదేపా తుడిచిపెట్టుకుపోవడం కూడా మొదలయింది. అయినా చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడంతో కేసీఆర్ పూర్తిగా ‘కూల్’ అయినట్లున్నారు.

అందుకే ఇవ్వాళ్ళ శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు, ప్రభుత్వాలు సహకరించుకోవాలని, ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో మెలగాలని అన్నారు. అనవసరంగా గిల్లి కజ్జాలు పెట్టుకొంటే రెండు రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్నివిధాల సహకరించేందుకు తన ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. దుమ్ముగూడెం దిగువకి పారే నీటిపై ఆంధ్రాకే హక్కు ఉందని అన్నారు. సముద్రంలో పోయే నీటిని ఒడిసిపట్టుకొని సమర్ధంగా వినియోగించుకొన్నట్లయితే ఇరు రాష్ట్రాలకి చాలా మేలు జరుగుతుందని అన్నారు.

గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేమాట చెపుతున్నారు. ఇన్నాళ్ళకు కేసీఆర్ కూడా అది గ్రహించి సహకరించుకోవడానికి సిద్దపడటం చాలా శుభపరిణామం. ఇకనయినా ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయాలు, విభేదాలు పక్కనపెట్టి పరస్పరం సహకరించుకొంటూ రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తే అందరూ హర్షిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close