“10 టీవీ” అమ్మకం చెల్లదా..? ఇప్పుడెందుకు వివాదం..?

కమ్యూనిస్టులు తమ వాయిస్ వినిపించుకోవడానికి క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏర్పాటు చేసిన “10 టీవీ” న్యూస్ చానల్ ఇప్పుడు చేతులు మారిపోయింది. నిర్వహణ భారంగా మారడంతో.. కమ్యూనిస్టులు తాము చెప్పే “బూర్జువా”, బడా పారిశ్రామిక వేత్తలకు “10 టీవీ”ని అమ్మేశారు. దాదాపుగా రూ. 30 కోట్ల రూపాయలకు ఈ చానల్‌ను… మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేశారని.. మీడియా వర్గాలు చెబుతూ ఉంటాయి. అయితే.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఏర్పాటు చేసిన చానల్‌ను.. ఆయా వాటాదారులకు తెలియకుండా..ఎలా అమ్ముతారన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీనిపై రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఫిర్యాదు కూడా దాఖలైంది. ఈ ఫిర్యాదు చేసింది కూడా… కామ్రేడ్లే…!

టెన్‌ టీవీని ఏర్పాటు చేయడానికి సీపీఎం అనుబంధ ఉద్యోగ, ఉపాధ్యాయ, బీమా, కార్మిక సంఘాల సభ్యుల నుంచి విరాళాలు వసూలు చేశారు. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో 1,82,000 మంది సభ్యుల నుంచి నిధులు వసూలు చేశారు. కానీ ఆర్వోసీకి మాత్రం 108 మంది పేర్లు మాత్రమే సమర్పించారు. 10టీవీని అమ్మేయడానికి నష్టాలను కారణంగా చూపించారు. ఆర్‌వోసీకి సమర్పించిన నివేదిక ప్రకారం 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా 4.71 లక్షలు, 2.30 కోట్లు లాభం చూపించారు. కార్మికుల కోసం పోరాడే… కామ్రేడ్లు.. 10 టీవీలో పని చేసే వారికి.. సరైన సమయంలో జీతాలు ఇవ్వకుండా.. ఇబ్బంది పెట్టారు. దానికీ ఆదాయం లేదనే సాకునే చూపించారు. ఉద్యోగుల్ని ఇలా ఇబ్బంది పెట్టబట్టే… 10 టీవీ అమ్మకం విషయంలో ఎవరి నుంచీ వ్యతిరేకత రాలేదు. అందు కోసమే… జీతాలు ఆలస్యం చేశారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వాటాదారులకు కనీస సమాచారం ఇవ్వకుండానే చానల్‌ను కమ్యూనిస్టు భావజాలంతో ఎలాంటి సంబంధంలేని ఫక్తు ప్రైవేటు కంపెనీకి విక్రయించేశారు. నిజానికి… రాష్ట్ర విభజన తర్వాత టీవీ చానల్‌ను నడిపేందుకు ఏపీ రాష్ట్ర శాఖ ముందుకు వచ్చినప్పటికీ అనుమతించలేదు. వందకోట్ల ఆస్తులున్న చానల్‌ను కేవలం 30 కోట్లకే విక్రయించినట్లు కమ్యూనిస్టు పార్టీలోని ఇతర నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు 10 టీవీ అమ్మకం వ్యవహారం.. అటు సీపీఎంలోనే కాదు.. అటు మీడియాలోనూ కలకలం రేపుతోంది. అయితే.. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడెందుకు.. ఇది హైలెట్ అవుతోందన్నది మరో కీలక ప్రశ్న..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close