ఆగస్టు 15కి అయినా “డి-పట్టాలు” మాత్రమే జగన్ ఇవ్వగలరా..?

ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇస్తున్నాం. ఐదేళ్ల తర్వాత అమ్మేసుకోవచ్చంటూ.. ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాల లబ్దిదారులను ఊరిస్తున్నారు. అయితే.. అలాంటి అవకాశం లేదని.. చట్టంలో అలాంటి వెసులుబాటు లేదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. మొదటి సారిగా ప్రభుత్వం…. తాము ఇస్తున్న ఇంటి పట్టాలు అమ్ముకోవచ్చన్న వెసులుబాటుతో.. జీవో తీసుకు వచ్చింది. అది నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు ఆ జీవోని కొట్టివేసింది. అయితే.. ఆ తర్వాత ఖాళీ స్థలాలు కాదు.. ఇల్లు కట్టుకున్న తర్వాత అమ్ముకోవచ్చంటూ ప్రభుత్వం మార్పులు చేసింది. ఆ ప్రకారమే.. కన్వేయన్స్ డీడ్ లతో.. ఇళ్ల స్థలాల పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంది. అయితే.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిందో లేదో కానీ … అలా.. అమ్ముకునేలా.. ప్రభుత్వం అవకాశం కల్పించడం చట్ట పరంగా సాధ్యం కాదన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇళ్లు లేని వారికి ఇళ్ల స్థలాలను అసైన్డ్ చట్టం ప్రకారమే ఇవ్వగలుగుతుంది. ఆ చట్టం ప్రకారం.. లబ్దిదారులు.. తాము… తమ వారసులు.. దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ అమ్ముకోవడానికి అవకాశం లేదు. అలా చేతులు మారితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధన ఉంది. దీని కారణంగానే… పెద్ద ఎత్తున అసైన్డ్ ల్యాండ్స్ ను ప్రభుత్వం సమీకరించి.. ఇళ్ల స్థలాలుగా మార్చేసింది. ఇప్పుడు తాము పంచుతున్న ఇళ్ల స్థలాలను అమ్ముకోవచ్చుంటూ.. ప్రభుత్వం లబ్దిదారులను ఆశ పెడుతోంది. జీవో నెంబర్ 44ను హైకోర్టు కొట్టి వేసినప్పుడు… దానిపై స్టే తెచ్చుకున్న తర్వాతనే పంపిణీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అలాందేమీ ప్రభుత్వం తెచ్చుకోలేదు.

ఇప్పటికే కోర్టు ఆదేశాలను పాటించకుండా.. చట్టాలను.. పట్టించుకోకుండా ఏపీ సర్కార్ పాలన సాగిస్తోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో… హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా పట్టాలు పంపిణీ చేస్తే అధికారులు బలయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే.. డి-పట్టాలు అయితే.. ఇప్పుడే పంపిణీ చేసేవారమని ముఖ్యమత్రి చెప్పారంటున్నారు. అయితే.. ప్రభుత్వం ఇల్లు ఇస్తోంది.. వారికి ఇళ్లు లేదనే అని… అలాంటప్పుడు.. .. వారు అమ్మేసుకుని మళ్లీ ఇల్లు లేని వారుగా మారిపోవడానికి చట్టాలు ఎలా అంగీకరిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఎలా చూసినా.. ప్రభుత్వం డి-పట్టాలు మాత్రమే ఇవ్వగలదని న్యాయనిపుణులు అంటున్నారు. రాజకీయంగా టీడీపీపై విమర్శలు చేయవచ్చు కానీ.. ప్రజలకు నిజంగానే… ఆస్తిని ఇవ్వాలనుకుంటే.. దానికి వేరే మార్గాలుంటాయని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close