ఉత్తరాఖండ్ వ్యవహారంలో మోడీ ప్రభుత్వానికి అవమానాలు తప్పవా?

కాంగ్రెస్ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడంపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో నిరసన తెలియజేస్తుందని అందరూ ఊహించిందే. ఊహించినట్లుగానే ఈరోజు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు కలిసి దానిపై చర్చ జరపాలని రాజ్యసభ కార్యక్రమాలను స్తంభింపజేశాయి. సుప్రీం కోర్టు విచారిస్తున్నప్పుడు సభలో దానిపై చర్చించలేమని చెపుతూ కేంద్రప్రభుత్వం చాలా తెలివిగా తప్పించుకొంది. కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు దానిపై సభలో చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టడంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకి వాయిదా పడింది.

ఈ విషయంలో కేంద్రప్రభుత్వం వాదన సహేతుకంగానే కనిపిస్తున్నప్పటికీ, సభలో దానిపై చర్చ చేపట్టడానికి ఇబ్బందేమీ ఉండదు. ఇదివరకు వివిధ కేసులు న్యాయస్థానాలలో ఉన్నప్పుడే అనేకసార్లు ఉభయసభలలో దానిపై చర్చలు జరిపారు కనుక ఈ అంశంపై కూడా సభలో చర్చించవచ్చు కానీ ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి ఇప్పటికే తలబొప్పి కట్టి ఉన్నందున, సభలో చర్చకు అనుమతిస్తే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉందనే సాకుతో తప్పించుకొందని చెప్పవచ్చు. కానీ ఈ కేసును ఏప్రిల్ 27న సుప్రీం కోర్టులో విచారణ జరుగబోతోంది కనుక ఇవ్వాళ్ళ ప్రతిపక్షాల బారి నుంచి తప్పించుకొన్నా బుధవారం తప్పించుకోలేదు.

ఒకవేళ సుప్రీం కోర్టు హరీష్ రావత్ కి శాసనసభలో మెజారిటీ నిరూపించుకొనే అవకాశం కల్పించితే కేంద్రప్రభుత్వానికి అదొక చెంపదెబ్బ, ఒకవేళ హరీష్ రావత్ మెజార్టీ నిరూపించుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మరొక చెంపదెబ్బ అవుతుంది. ఈ 5 రోజులలో ఉత్తరాఖండ్ లో మళ్ళీ రాష్ట్రపతి పాలన విదించబోమని అటార్నీ జనరల్ ముకుల్ రోహాత్గీ వద్ద సుప్రీం కోర్టు లిఖిత పూర్వకంగా హామీ తీసుకోవడం గమనిస్తే, అది కూడా రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తోందని అర్ధమవుతోంది. కనుక ఏవిధంగా చూసినా ఈవ్యవహారంలో కేంద్రప్రభుత్వానికి మరింత అవమానాలు తప్పకపోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close