గవర్నర్ పై రామచంద్రయ్య విమర్శలు..దేనికి?

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులని ప్రసన్నం చేసుకొనేందుకు సమస్యలని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు నిత్యం అనేక సమస్యలను ఆయంన దృష్టికి తెస్తున్నా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో ఒక పక్క రైతులు భూములు కోల్పోయి బాధలు పడుతుంటే, గవర్నర్ తాత్కాలిక సచివాలయం చాలా బాగుందని, చంద్రబాబు నాయుడు మంచి సమర్ధుడని పొగడటం సిగ్గు చేటని అన్నారు.

ఏదైనా రాష్ట్రంలో గవర్నర్ కొంచెం అత్యుత్సాహం చూపిస్తే ఆయన కేంద్రప్రభుత్వం తరపున కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తుంటాయి. డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్య జరుగుతున్న యుద్ధం అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఒకవేళ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టకుండా సఖ్యతగా మెలిగితే ఈవిధంగా విమర్శలు భరించవలసి వస్తుంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపులు, రాజధానికి భూసేకరణ వంటి అనేక సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు గవర్నర్ కి పిర్యాదులు ఇచ్చినప్పటికీ స్పందించకపోవడం వాస్తవమే. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ కి ఉన్న పరిమితులు, రాజకీయ ఇబ్బందులు దృష్ట్యా గవర్నర్ కొన్ని విషయాలలో చొరవ తీసుకోలేరని ఆయనని విమర్శిస్తున్నవారికి కూడ తెలుసు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగోకపోతే ఆ విషయం గురించి కేంద్రానికి తెలియజేయడం వరకే ఆయన బాధ్యత. బద్ధ శత్రువులులాగ వ్యవహరిస్తున్న ఇద్దరు ముఖ్యమంత్రులని సముదాయించుకొంటూ పనిచేయడం కత్తిమీద సామువంటిదే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు, అవినీతి, మంచి చెడుల గురించి గవర్నర్ నరసింహన్ కేంద్రానికి తెలియజేయకుండా ఉంటారని అనుకోలేము. ఆయన తన పరిధులని గుర్తించి ఆ మేరకే నడుచుకొంటున్నారు. కనుక గవర్నర్ ని తప్పు పట్టలేము.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close