పార్టీ కనుమరగవుతున్న వేళ పార్టీ కార్యాలయం ఓపెనింగ్!

యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి తెలంగాణాలో తెరాసను విలీనం చేసుకొని అక్కడ తిరుగులేని రాజకీయ శక్తిగా నిలవాలనుకోవడం. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో…జరుగుతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని కలలుకంటే, తెరాసయే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తనలో విలీనం చేసేసుకొనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ విధంగానయినా తన కోరిక నెరవేరుతోందని కాంగ్రెస్ అధిష్టానం సంతోషించాల్సిన దుస్థితి నెలకొంది.

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలయిన నేతలున్నప్పటికీ వారందరూ కేసీఆర్ వ్యూహాలని సమర్ధంగా ఎదుర్కొనలేక చేతులెత్తేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వరంగల్, నారాయణఖేడ్ ఉపఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలలో వరుసపరాజయాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ నిన్న సాయంత్రం తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలతో హైదరాబాద్ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. పార్టీ వరుస ఓటమికి కారణాలు అడిగి తెలుసుకొన్నారు. ఇప్పుడు ఆయనే కాదు…సాక్షాత్ రాహుల్ గాంధి దిగివచ్చినా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాలేరని స్పష్టమవుతోంది. కనుక మళ్ళీ పరిస్థితులు మారేవరకు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ బారి నుండి కాపాడుకోగలగితే అదే గొప్ప విషయం అవుతుంది.

ఇక రాష్ట్ర విభజనతోనే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనం మొదలయిందని చెప్పవచ్చును. అప్పటి నుండి కోలుకోనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఒకరొకరుగా వేరే పార్టీలలోకి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ తెదేపా విఫలమయినా ఆ ప్రయోజనం వైకాపా దక్కించుకోగలదు తప్ప కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. బహుశః అందుకే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని వైకాపాను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొందామని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేసింది కానీ అవి కూడా ఫలించలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. మిగిలినవారందరూ రాహుల్ గాంధి, దిగ్విజయ సింగ్ వంటి నేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడే మొహాలు చూపిస్తున్నారు. మరికొందరు పార్టీ మారడం కోసం తగిన సమయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఆంద్ర రత్న భవన్’ ని ప్రారంభించడానికి దిగ్విజయ సింగ్ ఈరోజు వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ తుడిచిపెట్టుకుపోతున్న సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయం ఆరంభించడం నవ్వు తెప్పిస్తోంది.

కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఏర్పాటు చేసినప్పటికీ తెలంగాణా ప్రజలు నేటికీ ఆ పార్టీని దూరంగా ఉంచుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా, వారి అభిప్రాయాలకు, మనోభావాలకు, ఉద్యమాలకు ఏమాత్రం విలువనీయకుండా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎప్పటికయినా ఆదరిస్తారా? అంటే అనుమానమే. తెదేపా, వైకాపా, బీజేపీ మూడు పార్టీలు పూర్తిగా విఫలమయితేనే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో?కనుక అంతవరకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా కాపాడుకొంటారో చూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close