“దుబాయ్ హంగామా”లో సీఎం రమేష్ ఆపరేషన్ ఆకర్ష్..!?

సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం.. దుబాయ్‌లో సూపర్ లగ్జరీ ఈవెంట్‌గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ముఖ్యులు హాజరయ్యేందుకు వెళ్లారు. ఎవరెవరు వెళ్లారన్నదానిపై క్లారిటీ లేదు. కానీ.. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాత్రం.. భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించారు. సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుక ఒక్కటే అక్కడ జరగడం లేదని.. అంతకు మించి జరుగుతోందని అంటున్నారు. అంతకు మించి ఏమిటంటే… అక్కడ.. “ఆపరేషన్ ఆకర్ష్” నడుస్తోందట..!. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున దుబాయ్ వెళ్లారని.. వారంద్నీ ఆకర్షించేందుకు.. తమ పార్టీలో చేర్చుకునేందుకు అక్కడ చర్చలు జరుగుతున్నాయంటున్నారు.

సీఎం రమేష్ …అమెరికాకు చెందిన ఓ డాక్టర్ కుమార్తెతో.. తన కుమారుడి పెళ్లిని నిశ్చయం చేశారు. నిశ్చితార్థాన్ని అటు అమెరికాలో.. ఇటు ఇండియాలో కాకుండా.. దుబాయ్ లో ఏర్పాటు చేశారు. అతిధులందర్నీ.. ప్రత్యేక విమానాల్లో దుబాయ్ కు తీసుకెళ్తాన్నారు. సహజంగా.. సీఎం రమేష్.. రాజకీయంగా కీలకమైన వ్యక్తి కావడంతో.. ఆయన అతిధుల జాబితాలో… అందరూ రాజకీయ నేతలే ఉంటారు. అయితే.. అనూహ్యంగా.. ఆయన కుమారుడి నిశ్చితార్థానికి వెళ్లిన వారిలో.. వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. అదే.. ఊహాగానాలకు కారణం అవుతోంది. పది మంది వరకూ ఎంపీలు.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు దుబాయ్ వెళ్లిన వారి జాబితాలో ఉన్నారంటున్నారు.

ఈ ఊహాగానాలకు.. సీపీఐ నారాయణ.. మరింత ఆజ్యం పోస్తున్నారు. సీఎం రమేష్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పాల్పడుతున్నారని.. అంటున్నారు. ఇప్పటికే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తన ఎంపీలపై..అపనమ్మకాన్ని పెంచుకున్నారు. సుజనా చౌదరి… “టచ్” కామెంట్ల తర్వాత ఆ పార్టీలో మరింత గందరగోళం ఏర్పడింది. తాజా పరిస్థితులు దీన్ని పెంచేలా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close