పవన్ కళ్యాణ్ శిఖండి: నారాయణ

ముద్రగడ పద్మనాభాన్ని వైకాపా శిఖండిలా ఉపయోగించుకొందని తెదేపా నేత ఒకరు ఆరోపించారు. ఇప్పుడు సిపిఐ నేత నారాయణ కూడా పవన్ కళ్యాణ్ న్ని ఉద్దేశ్యించి అదే మాట అన్నారు. తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ని శిఖండిలాగ ఉపయోగించుకొంటోందని, చంద్రబాబు నాయుడుకి రాజకీయ ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా అతనిని ముందుకు తీసుకువచ్చి నిలబెడుతుంటుందని నారాయణ ఎద్దేవా చేసారు. చంద్రబాబు నాయుడు పిలవగానే తెదేపాను సమస్యల నుండి బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ పరుగున వస్తుంటాడని ఎద్దేవా చేసారు. కాపుల సమస్యను చంద్రబాబు నాయుడు పరిష్కరించకుండా రెండేళ్ళపాటు కాలక్షేపం చేయడం వలననే అది తుని విద్వంసానికి దారి తీసింది కనుక దానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని నారాయణ అన్నారు. ముద్రగడ పద్మనాభంపై కూడా నారాయణ ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ముద్రగడ తన భార్యను కూడా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోబెట్టడం గృహ హింసగా భావించాలని అన్నారు.

పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ఒక విలేఖరి కూడా ఆయనని ఇదే ప్రశ్న అడిగాడు. చంద్రబాబు నాయుడు ఆపదలలో చిక్కుకొన్నపుడల్లా మీరు ఆపద్భాందవుడిలా ఎందుకు తరలివస్తున్నారని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ‘మీరు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏమి చెప్పారు..ఇప్పుడు ఏవిధంగా వ్యహరిస్తున్నారో ఒకసారి ఆలోచించి చూసుకోమని’ కోరారు. అంటే రాజకీయాలలోకి ప్రవేశించిన తరువాత పవన్ కళ్యాణ్ కూడా సగటు రాజకీయ నేత మాదిరిగానే వ్యవహరిస్తున్నారని నారాయణ, రామ్ గోపాల్ వర్మల అభిప్రాయం కావచ్చును.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత మొదట బీజేపీకి మాత్రమే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కానీ మోడీ సలహా మేరకు తెదేపాకు కూడా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. తాను వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ అవసరమయితే ప్రజల తరపున నిలబడి వాటిని ప్రశ్నిస్తానని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన తెదేపాకు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇటువంటి విమర్శలు మూటగట్టుకోవలసి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close