డీఎస్‌ ద్వారా డీల్‌ ఫైనలైజ్‌ చేసుకున్న దానం!

దానం నాగేందర్‌…తన అవసరానికి ఎన్నిసార్లు ఎన్ని పార్టీల్లోకి అయినా గెంతడానికి సిద్ధంగా ఉండే నాయకుడు ముద్ర పడిన సీనియర్‌ రాజకీయ వేత్త. గ్రేటర్‌ ఎన్నికలకు కొన్ని వారాల ముందు.. దానం ఇక తెరాసలో చేరిపోతున్నట్లే అని బీభత్సంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికి దానికి పుల్‌స్టాప్‌ పడింది. మళ్లీ తాను పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌లో ఉంటా అంటూ ప్రతిజ్ఞలు చేసి.. అందరితో కలిసి మెలిసి తిరిగారు. కానీ ఇప్పుడు గ్రేటర్‌ ఫలితాలు వచ్చేసరికి దానం నాగేందర్‌కు దిమ్మతిరిగి క్లారిటీ వచ్చేసినట్లుంది. భవిష్యత్తులో కనీసం తనకు ఎమ్మెల్యేస్థానమైనా స్థిరంగా మిగలాలంటే.. తెరాసలోకి వెళ్లడం తప్ప గత్యంతరం లేదని అనుకుంటున్నట్లుగా.. కనిపిస్తోంది. అందుకే ఆయన తక్షణం తన గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. అయితే దీనికంటె ముందుగానే.. ఆయన తన రాజకీయ గురువు.. ప్రస్తుతం తెరాసలో ఒక మోస్తరుగా చక్రం తిప్పుతున్న నాయకుల్లో ఒకరైన డీ శ్రీనివాస్‌తో మంతనాలు పూర్తి చేసుకుని డీల్‌ మాట్లాడుకున్న తర్వాతనే.. ఇక్కడ రాజీనామా చేసినట్లుగా తెలుస్తున్నది.

నిజానికి దానం నాగేందర్‌ ఎన్నడో తెరాసలో చేరిపోయి ఉండాల్సింది. అప్పట్లో ఆయన చేరిక కూడా డీఎస్‌ ద్వారానే ఫైనలైజ్‌ అయింది. కానీ ఆయనకు ఏం పదవులు కావాలనే విషయంలో బేరాలు సెట్‌ కాలేదు. దానం ఏకంగా మేయర్‌ పీఠానికి టెండర్‌ పెట్టారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే తెరాస మాత్రం మేయర్‌ పీఠం కుదర్దు.. బుగ్గకారు ఉండేలా ఏదో ఒక నామినేటెడ్‌ పదవి మాత్రం ఇస్తాం అని ఆఫర్‌ చెప్పినట్లు వినిపించింది. దానితో పాటూ కేసీఆర్‌ సమక్షంలో చేరాలా? కేటీఆర్‌ సమక్షంలో చేరాలా? అనే విషయంలో కూడా తన స్థాయికి తగినట్లుగా తెరాస గౌరవించడం లేదనే అభిప్రాయం కలిగి దానం చేరడానికి ముందే అలిగి.. తెరాసలో చేరడాన్ని మానుకున్నట్లుగా పుకార్లు వచ్చాయి.

సీన్‌ కట్‌ చేస్తే-

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్‌లో ఉండిపోయినందువలన సాధించింది ఏమిటో.. దానంకు తెలిసిపోయింది. ఇలాగే ఉండడం వలన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఆయనకు స్పష్టంగా కనిపించినట్లుంది. అందుకేనేమో వెంటనే తన పదవికి రాజీనామా చేసేశారు. కాకపోతే ఇప్పుడు ఆయనకు తెరాస వద్ద ‘బేరమాడే శక్తి’ సన్నగిల్లిపోయిందని అనుకోవాలి. నామినేటెడ్‌ పోస్టు అయినా ఇస్తారా? లేదా? అనేది అనుమానమే. కాకపోతే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు నగరంలో ఏదో ఒక చోట నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తే చాలు.. తతిమ్మా డిమాండ్లు ఏమీ లేకుండా.. నిశ్శబ్దంగా పార్టీలో చేరడానికైనా నాయకులు ఒప్పుకునే పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తొందర్లోనే డీఎస్‌ నిర్ణయించిన ముహూర్తానికి దానం చేరిక ఉంటుందని.. తెరాస అధినేతల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనకాపల్లి లోక్‌సభ రివ్యూ : సీఎం రమేష్ వైసీపీ పరోక్ష సాయం !

అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకం. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన నుంచి నాగబాబు...

క‌న్న‌ప్ప సెట్లో అక్ష‌య్ కుమార్‌

`క‌న్న‌ప్ప‌` కు స్టార్ బ‌లం పెరుగుతూ పోతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌, న‌య‌న‌తార‌.. వీళ్లంతా ఈ ప్రాజెక్ట్ లో భాగం పంచుకొన్నారు. అక్ష‌య్ కుమార్ శివుడిగా న‌టించ‌బోతున్నాడంటూ ప్ర‌చారం...

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close