శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం అమలు చేసేసి.. ఎంత మంది భక్తులకు.. ఆ కోనేటి రాయుడి దర్శనాన్ని సంతృప్తిగా అందించగలరు..? ఇప్పుడు ఇదే పెద్ద విషయం. శ్రీవారి దర్శనాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం భక్తులందరినీ దర్శనాలకు అనుమతించకుండా కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనాలను ప్రారంభించనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించినందున గంటకు 300 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా రోజుకు 15 గంటలపాటు దర్శన సమయం కేటాయిస్తే.. కేవలం నాలుగు వేల ఐదు వందల మంది మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 20 నుంచి శ్రీవారి దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రెండున్నర నెలల సుదీర్ఘ కాలం తిరుమలకు భక్తులను నిషేధం విధించాల్సి వచ్చింది.

ఇక నుంచి పాసుల వ్యవస్థ ప్రవేశ పెట్టే అవకాశంఉంది. ముందస్తుగా అనుమతి తీసుకున్న వారే కొండపైకి వచ్చేలా నిబంధనలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎనిమిదో తేదీ తర్వాత ప్రయోగాత్మక దర్శనాలతో పరిస్థితిపై క్లారిటీ వచ్చిన తర్వతా సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆ లోపే విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close