వైసీపీలోకి “ఆంధ్రజ్యోతి” పార్టనర్..! విజయవాడ ఎంపీగా పోటీ..!

విజయవాడ వైసీపీ ఎంపీగా అభ్యర్థిగా… విజయ్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ , ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ వాటాదారుగా ఉన్న దాసరి జైరమేష్ పోటీ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. దాసరి జై రమేష్.. వైసీపీలో చేరడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చాలా రోజుల నుంచి విజయవాడ ఎంపీ టిక్కెట్ ఎవరికి ఇవ్వాలా.. అని జగన్మోహన్ రెడ్డి.. చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లు పరిశీలిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరికి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు .. దాసరి జై రమేష్‌ను.. ఒప్పించి.. జగన్ వద్దకు తీసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు దాసరి జై రమేష్ కూడా.. టీడీపీలో కీలకంగా వ్యవహరించారు.

2014 ఎన్నికల ముందు వరకు.. ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరరావు.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో మాత్రం ఆయనను పక్కన పెట్టి.. వల్లభనేని వంశీకి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్నుంచి సోదరులిద్దరూ.. పెద్దగా.. రాజకీయాల్లో కనిపిచండం లేదు. నిజానికి దాసరి జై రమేష్.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఓ సారి విజయవాడ నుంటి టీడీపీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉపేంద్ర చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు.. వైసీపీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

దాసరి జై రమేష్… ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వాటాదారుగా ఉన్నారు. వేమూరి రాధాకృష్ణ.. నేతృత్వంలో ఆంధ్రజ్యోతి పునంప్రారంభ సమయంలో… ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఎక్కువగా ఆయనే పెట్టుబడులు పెట్టారని చెబుతారు. తర్వాత ఆయన మైనర్ వాటాదారుగా మారిపోయారు. ప్రస్తుతం… ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఓ వాటాదారుగా ఉన్నారు. ప్రతి ఏడాది మార్చి ఒకటో తేదీన నిబంధనల ప్రకారం ప్రతి పత్రిక.. ఫామ్‌ IV ను ప్రచురిస్తూ ఉంటుంది. ఇప్పటికీ.. దాసరి జై రమేష్ పేరు వాటాదార్ల జాబితాలో ఉంటూనే ఉంటుంది. వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే.. పత్రికలో వాటాలు ఉన్న వ్యాపారవేత్త.. ఇప్పుడు అదే పార్టీ తరపున వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close