జగన్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ల విచారణకు ముహుర్తం ఫిక్స్..! 

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు లేఖ రాసి దాన్ని  ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల పదహారో తేదీన విచారణ జరపనుంది. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారని.. సుప్రీంకోర్టు లాయర్లు జీఎస్ మణి, సునీల్ కుమార్ సింగ్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసుల విచారణ వేగవంతం అయ్యే దశలో.. న్యాయమూర్తుల్ని బెదిరించేందుకు ఇలా చేశారన్న ఆరోపణలు అంతటా వెల్లువెత్తాయి. అనేక మంది న్యాయనిపుణులు, న్యాయకోవిదులు జగన్మోహన్ రెడ్డి తీరు కోర్టు ధిక్కరణగానే ప్రకటించారు. ఈ సమయంలో… కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు రానుండటం ఆసక్తికరంగా మారింది. 

తన లేఖలో జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. సాధారణంగా న్యాయమూర్తులపై ఆరోపణలు చేయడానికి ఓ పద్దతి ఉంటుంది . రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు అత్యున్నత స్థాయి రక్షణ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. తన దగ్గర అధికారం ఉన్నందున కేసులు కూడా నమోదు చేసి..  దాడికి పాల్పడుతున్నారన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. 

దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా జగన్ న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన లాయర్లు తమ పిటిషన్‌లో వివరించారు. రాజ్యాంగ నియమాలను జగన్ ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని చూస్తున్నారని అంటున్నారు. ఈ పిటిషన్‌పై విచారణ పదహారో తేదీన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close