దావూద్ ఇబ్రహీం కధ అలాగ ముగియబోతోందా?

ముంబై ప్రేలుళ్ళతో సహా అనేక తీవ్రమయిన నేరాలలో ‘మోస్ట్ వాంటడ్ క్రిమినల్’ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తీవ్ర అనారోగ్యానికి గురయినట్లు తాజా సమాచారం. మధుమేహం, రక్తపోటు వ్యాధుల కారణంగా అతని రెండు కాళ్ళకు రక్త సరఫరా నిలిచిపోవడంతో అక్కడి కణజాలం కుళ్ళిపోయింది. అ కారణంగా రెండు కాళ్ళు తీసివేసేయాల్సి రావచ్చునని సమాచారం. శరీరంలో మిగిలిన అవయవాలకు కూడా రక్తం సరఫరా నిలిచిపోవడంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సి.ఎన్.ఎన్.న్యూస్-18 బయటపెట్టింది. అతనికి సోకిన గ్యాంగ్రీన్ వ్యాధి శరీరమంతా వ్యాపించడం చేత బ్రతికే అవకాశాలు లేన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతను పాకిస్తాన్ లోని కరాచీలో లియాఖత్ జాతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సి.ఎన్.ఎన్. పేర్కొంది. మరో విశేషం ఏమిటంటే అతనికి ఆ ఆసుపత్రిలో వైద్యులు కాక, పాకిస్తాన్ ఆర్మీ వైద్యులు చికిత్స చేస్తున్నట్లు సి.ఎన్.ఎన్. పేర్కొంది. ముంబై ప్రేలుళ్ళ కేసులో నిందితుడిగా ఉన్న అతనిని అప్పజెప్పమని భారత్ కోరినప్పుడు, అతను తమ దేశంలో లేడని పాకిస్తాన్ వాదించింది. కానీ అతను పాక్ ప్రభుత్వ రక్షణలోనే ఉన్నాడని ఇది నిరూపిస్తోంది. అంతే కాదు అటువంటి కరడుగట్టిన నేరస్తుడు, భారత్ ప్రేలుళ్ళకు కుట్రలు పన్నిన వ్యక్తిని పాక్ దాచిపెట్టి, అతనిని రక్షించాలనుకోవడం పాక్ ద్వంద వైఖరికి అద్దం పడుతోంది. ఒకవేళ అతను నిజంగానే చనిపోతే, అతనిని పట్టుకొని విచారించేందుకు ఇంకా భారత్ శ్రమ పడనవసరం లేదు అలాగే అతనిని విచారించేందుకు భారత ప్రజల కష్టార్జితాన్ని (ప్రజాధనం) వృధా చేయనవసరం లేదు. అంత కరడుగట్టిన నేరస్తుడుకి దేవుడే సరయిన శిక్ష విదిస్తున్నాడనుకోవచ్చు. లేకపోతే కోటీశ్వరుడయిన అతనికి ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ ఈవిధంగా ఘోరమయిన చావు చావబోవడం దైవలీల కాకపోతే మరేమిటి?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close