`ఉరి’ అమానుషం కాదు

ముంబయి వరుస బాంబుప్రేలుళ్ల కేసులో ఉగ్రవాది యాకూబ్ మీమన్ కి మరణశిక్ష (ఉరిశిక్ష) అమలుచేసే సమయంలో ఉరితీతపై పెద్దఎత్తునే చర్చలు జరిగాయి. ఇది అమానుషమనీ, మొరటైన ఆటవికచర్య అని కొంతమంది బాహాటంగానే విమర్శించారు. అయితే, కరడుగట్టిన ఉగ్రవాదకి మరణశిక్షే ఉచితమని చివరకు ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పడంతో యాకూబ్ ని పూణెజైల్లో ఉరితీశారు.

ఉరిశిక్షను ఎత్తివేయాలనీ, నేరస్థునికి అంతిమ శిక్షగా జీవితఖైది సరిపోతుందని వాదించేవారికి చెంపపెట్టుగా ఇప్పుడు మరోకేసులో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం – మరణశిక్ష (ఉరిశిక్ష) అమానుషంకాదనీ, మొరటైన శిక్ష అంతకంటే కాదనీ చెప్తూ, దారుణదుశ్చర్యలకు పాల్పడినవారికి ఇది తప్పదని తేల్చి చెప్పింది. సర్వోన్నత న్యాయస్థానం తాజా వివరణతో పౌరసమాజంలో ఇంతవరకు జరిగిన చర్చకు ముగింపు సమాధానంవచ్చినట్టుగానే భావించవచ్చా…?

మరణశిక్ష విధించిన కేసులోని దోషి తన శిక్షను తగ్గించాలంటూ అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం పై మేరకు వ్యాఖ్యానించింది. దోషి విక్రమ్ సింగ్ 16ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా హత్యచేశాడు. ఈ కేసుపై విచారణ ముగిశాక అతనికి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే, మరణశిక్ష అత్యంత కఠినమైనదనీ, అది కేవలం ఉగ్రవాద నేరాలకు పాల్పడినవారికి మాత్రమేనంటూ దోషి తరఫు న్యాయవాది వాదించారు. వాదోపవాదాలువిన్న తర్వాత సుప్రీం ధర్మాసనం వివరణ ఇస్తూ, దోషి చేసిన నేరం అత్యంత దుశ్చర్యనీ, దారుణంగా ఉందని పేర్కొంటూ, దోషికి మరణశిక్ష విధిస్తే అది ఆటవిక – మొరటైన శిక్షకానేకాదనీ,అమానుషం అంతకంటేకాదని తేల్చిచెప్పింది. ఇది రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును ఉల్లంఘించినట్టు కాదని కూడా ధర్మాసనం వివరణ ఇచ్చింది.

మరణశిక్ష విధించడమన్నది చాలా అరుదైన కేసుల్లో అరుదైన సందర్బంలో జరుగుతుంటుంది. ఈమధ్య కాలంలో ఉగ్రవాద దుశ్చర్యలకు పాల్పడిన దోషుల విషయంలో మరణశిక్ష విధించడమూ, అమలుచేయడం జరగడంతో సాధారణ పౌరుల్లో ఈ అంతిమ శిక్ష కేవలం టెర్రరిస్టులకు మాత్రమే వర్తిస్తుందన్న భ్రమ ఏర్పడింది. 2001లో పార్లమెంట్ పై దాడికేసులో అప్ఝల్ గురుని, 26/11 ముంబయి ఎటాక్ కేసులో అజ్మల్ కసబ్ ని, ఈమధ్య ముంబయి వరుస బాంబుపేలుళ్ల కేసులో యాకూబ్ ని ఉరితీశారు.

కాగా, 2005లో అభివర్మ అనే విద్యార్థిని కిడ్నాప్ చేసి హత్యచేసిన కేసులో విక్రమ్ సింగ్ అరెస్టయ్యాడు. విచారణ ముగిశాక పంజాబ్ -హర్యాణ హైకోర్టు విక్రమ్ ను దోషిగా ప్రకటిస్తూ మరణశిక్ష విధించింది. అయితే అతను ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం కూడా అదే తీర్పును ఖరారుచేసింది. చివరకు ముగ్గురు సభ్యుల ధర్మాసనం మరణశిక్షనే ఖరారుచేస్తూ ఈ అంతిమ శిక్ష అమలుచేయడమన్నది ఆటవికం, అమానుషం కాదని తేల్చిచెప్పింది.

సుప్రీం ఇచ్చిన ఈ వివరణతో మరణశిక్ష (ఉరి శిక్ష) పై తాజా తలెత్తిన డిబేట్ సమిసినట్టుగానే భావించవచ్చు.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close