తెలుగు 360 చెప్పినదే : జగన్‌కు దేశాయి గుడ్‌బై!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల తీరును బట్టి అంచనా వేసి… ఫిరాయింపుల ఒక సంకేతంగా తెలుగు 360 డాట్‌ కాం విశ్లేషించిన ఒక వైనం ఇప్పుడు వాస్తవం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మదనపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి తెలుగుదేశంలో చేరవచ్చుననే ప్రచారం శనివారం నాడు ముమ్మరంగా జరిగింది. ఆయన శనివారంనాడు చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో భేటీ కావడమే ఈ ప్రచారానికి కారణంగా కనిపిస్తోంది.

మదనపల్లెకు చెందిన దేశాయి తిప్పారెడ్తి తెలుగుదేశంలో చేరవచ్చుననే ప్రచారం చాలా కాలంగా నడుస్తోంది. దానికి తగినట్లుగా ఇటీవలి శాసనసభ సమావేశాల్లో సాగునీటి పథకాల గురించి సీఎం మాట్లాడుతూ.. మీమీ నియోజకవర్గాలకు కూడా నీళ్లు ఇస్తాం.. అంటూ ప్రత్యేకంగా పలమనేరు ఎమ్మెల్యే అమరనాధరెడ్డి, మనదపల్లె ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిలను ఉద్దేశించి.. మీ నియోజకవర్గాలకు కూడా మీరు అడ్డుపడినా సరే నీళ్లు ఇవ్వబోతున్నాం అంటూ సెలవిచ్చారు. ఈ ఇద్దరూ తెదేపా పట్ల సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో ఇలా వారిద్దరినీ ప్రత్యేకించి మాట్లాడడం ద్వారా సీఎం చంద్రబాబు మరింత సంకేతాలు ఇచ్చారని తెలుగు360 ఒక విశ్లేషణ అందించింది.

అందులో అంచనా వేసినట్లు దేశాయి తిప్పారెడ్డి తెదేపాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం నాడు హంద్రీనీవా ప్రాజక్టు కాలువల పనులను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించడానికి చిత్తూరు జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును మదనపల్లెలో దేశాయి తిప్పారెడ్డి కలిశారు. వారిద్దరూ విడిగా సమావేశమై మాట్లాడుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిశా అని చెప్పడం మామూలే గానీ.. అదే సాకు చెప్పి పార్టీలు మారిపోతున్న వైనం కూడా మనం గమనించాల్సి ఉంది. మరి దేశాయి గారు.. జగన్‌కు గుడ్‌బై చెప్పే ముహూర్తాన్ని ఎప్పటికి సెట్‌ చేసుకున్నారో వేచిచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close