ధోనీ ఫెయిల్యూర్ స్టోరీ..! చెన్నై అవుట్..!

చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ హిస్టరీలో ఎప్పుడూ లేనంత ఘోరమైన ఆటతీరును కనబర్చింది. మధ్యలో ఫిక్సింగ్ కళంకంతో … కొన్ని సీజన్లు మిస్సయినా.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మిస్టర్ కూల్ ధోనీ నాయకత్వంలో కూల్ విక్టరీస్ సాధిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. విజయాల కోసం తడబడుతోంది. పది మ్యాచ్‌లు ఆడి మూడంటే మూడు మాత్రమే గెలిచి.. అట్టడుగు స్థానంలో నిలిచింది. మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే చెన్నై ఆడాల్సి ఉంది. నాలుగు గెలిచినా పధ్నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ప్లే ఆఫ్స్‌కు చేరడానికి అవి సరిపోవు.

నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో చెన్నై ఘోర పరాజయం పాలైంది. అసలు పోరాడటమే ఆ టీమ్ మర్చిపోయిందా అన్నట్లుగా ఆటతీరు మారిపోయింది. ఇరవై ఓవర్ల పాటు ఆడి.. ఐదు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎడారి పిచ్‌లు బ్యాటింగ్‌కు మరీ అంత కఠినంగా ఏమీ లేవు. అయినా ఎవరూ.. విజయం కోసం ఆడాలన్నట్లుగా ఆడలేకపోయారు. 126 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ని ఆడుతూ పాడుతూ సాధించింది.దీంతో చెన్నై ఇంటికెళ్లిపోవాల్సి వచ్చింది.

టోర్నీ ప్రారంభం నుంచి చెన్నైకు కష్టాలే. క్యాంప్‌కు ధోనీ రాగానే.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కురిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్తే.. కరోనా వెంటాడింది. ఆలస్యంగా ప్రాక్టీస్ ప్రారంభించాల్సి వచ్చింది. ఆ చికాకుల్లో ఉండగానే.. హోటల్లో సరైన రూమ్ ఇవ్వలేదన్న కారణంగా రైనా ఇంటికెళ్లిపోయాడు. మళ్లీ రానే రానని తేల్చేశాడు. రాయుడు ఒక్క మ్యాచ్‌లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచినా.. తర్వాత గాయపడ్డాడు. కోలుకుని మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చినా ఆటతీరు ఆ స్థాయిలో ఉండలేదు. డూప్లెసిస్ లాంటి ఆటగాళ్లు..ఆడిగే గెలిచింది..లేకపోతే లేదు. మొత్తానికి చెన్నై ఆట మారిపోయింది. పోరాడకుండా ఓడింది. ఇది.. ధోనీ ఫ్యాన్స్‌ను ఇబ్బందిపెట్టేదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close