ఇక ఏ గుడీకీ వద్దు తన గుడికే రమ్మంటున్న మోహన్ బాబు!

షిరిడికి వెళ్లవద్దు.. అంత కంటే గొప్పగా తాను గుడి కట్టా.. అందరూ తన గుడికే వచ్చేయమంటున్నారు మోహన్ బాబు. సాయిబాబా పై భక్తితో ఆలయం నిర్మించిన వారు ఇలా కూడా మాట్లాడతారా అని ఆశ్యర్యపోయే రీతిలో మాట్లాడుతున్నారు. సినీ నటుడు మంచుమోహన్ బాబు తిరుపతి సమీపంలో తమకు ఉన్న విద్యాలయాల దగ్గర షిరిడి సాయి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాము నిర్మించిన ఆలయం షిరిడి కన్నా గొప్పదని చెప్పుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదమవుతోంది.

ఇకపై ఎవరూ షిర్డీకి వెళ్ళాల్సిన అవసరం‌లేదని, రుషికేష్ సహా అనేక పవిత్ర స్థలాల నుంచి మూలికలు, చెక్కలు తీసుకొచ్చి ఆలయంలో పీఠం కింద ఉంచామని, ఇంత పవిత్రమైన ఈ ఆలయం నిర్మించడంతో ఇక సాయి నాధుని భక్తులు ఎవరూ షిరిడి ఆలయానికి వెళ్లనక్కర్లేదని వ్యాఖ్యానించారు. మోహన్ బాబు వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆలయ గొప్పతనాన్ని చెప్పుకునే క్రమంలో షిరిడికి కూడా భక్తులు వెళ్లొద్దని.. తమ ఆలయానికే రావాలని చెప్పుకోవడం వివాదాస్పదమవుతోంది. అంతే కాదు శ్రీవారి భక్తులందరూ.. శ్రీవారి దర్శనం తర్వాత తమ గుడికి రావాలంటున్నారు.

షిరిడి సాయినాథునిపై భక్తితో ఆలయాన్ని నిర్మించడం మంచిదే కానీ ఇలా.. తమ ఆలయమే గొప్ప అని.. ఇతర సాయినాధుని ఆలయాలకు వెళ్లవద్దని చెప్పడం ఏమిటనేది భక్తులకు అర్థం కాని విషయం. ప్రపంచంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి.. షిరిడిని మంచిన ఖర్చుతో కట్టేస్తే అది షిరిడి కంటేపెద్ద ఆలయం అవుతుందా..? అలా అవుతుందని ఆలోచించేవారు ..భక్తులు ఎందుకు అవుతారు..భక్తి వ్యాపారం చేసే వారు అవుతారు కానీ. మోహన్ బాబు ఇప్పుడు ఇదేకేటగిరిలో చేరిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close