రాజ‌శేఖ‌ర్‌తో ‘మెగా’ ప్యాచ‌ప్‌

చిరంజీవి – రాజ‌శేఖ‌ర్‌.. వీరిద్ద‌రిదీ టామ్ అండ్ జెర్రీ అనుబంధం. ఇది వ‌ర‌కు బాగానే ఉండేవారు కానీ.. చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీ పెట్టాక‌, ఆ పార్టీపై రాజ‌శేఖ‌ర్ కామెంట్లు చేశాక‌… ఇద్ద‌రి మ‌ధ్యా గ్యాప్ వ‌చ్చేసింది. ఆ గ్యాప్ పూడిన‌ట్టే పూడి.. పెరిగిపోవ‌డం అల‌వాటుగా మారింది. మొన్న‌టికి మొన్న `మా` వివాదం విష‌యంలో… ఓ ప్రెస్ మీట్‌లో, ఛాన‌ల్స్ అన్నీ లైవ్‌లో ఉండ‌గా, చిరంజీవి స‌మ‌క్షంలో.. రాజ‌శేఖర్ ఎర్ర‌జెండా ఎగ‌రేయ‌డం, దాంతో.. రాజ‌శేఖ‌ర్‌పై క్ర‌మ‌శిక్షణ చ‌ర్చ‌లు తీసుకోవాల‌ని చిరంజీవి `మా` పెద్ద‌ల్ని కోర‌డం.. చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అప్ప‌టి నుంచీ.. ఈ గ్యాప్ ఇంకాస్త పెద్ద‌దైంది.

ఇప్పుడు ఈ గ్యాప్‌ని పూడ్చ‌డానికి అల్లు అరవింద్ ముందుకొచ్చిన‌ట్టు స‌మాచారం. రాజశేఖ‌ర్‌తో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఇది వ‌ర‌కు ప‌లాస ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్‌కి గీతా ఆర్డ్స్ అడ్వాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. గీతా ఆర్ట్స్ అంటే…. ఓర‌కంగా చిరంజీవి సొంత సంస్థ‌. సో.. `మా మ‌ధ్య ఏం లేదు…` అని చెప్పుకోవ‌డానికి అటు చిరంజీవికి, ఇటు రాజ‌శేఖ‌ర్‌కీ ఇదో చ‌క్క‌టి అవ‌కాశం. నిజానికి గీతా ఆర్ట్స్ యువ హీరోల‌తో, ఫామ్ లో ఉన్న హీరోల‌తో సినిమాలు చేస్తుంటుంది. తొలిసారి ఆ నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెట్టి, ఫ్లాప్ హీరో రాజ‌శేఖ‌ర్ హీరోగా సినిమా చేయ‌డంలో ఆంతర్యం ఫిల్మ్‌న‌గ‌ర్ పెద్ద‌ల‌కు అర్థం కావ‌డం లేదు. నిజంగా గీతా ఆర్ట్స్ లో రాజ‌శేఖ‌ర్ సినిమా చేస్తే.. మెగా ప్యాచ‌ప్ దాదాపు స‌క్సెస్ అయిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close