కల్లు తాగడం కూడా ఎన్నికల ప్రచారంలో భాగమేనట!

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయనాయకులు ఏ ఎండకు ఆ గొడుగు పెడుతున్నట్లుగా ప్రజలను ఆకర్షించేందుకు తాము సందర్శించే ప్రదేశం, అక్కడి ప్రజలు, వారి కులమతాలు, వేష బాషలను అనుకరించడం చాలా సహజమే కానీ కల్లు గీత కార్మికులను ఆకర్షించడానికి ఎన్నికల ప్రచార సభలో ఏకంగా కల్లు తాగడం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమే. అలాగ కల్లు తాగింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్. వరంగల్ ఉప ఎన్నికలు ప్రచారంలో పాల్గొంటున్న ఆయన సోమవారం వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌడ కులస్తులతో సమావేశం అయ్యేరు. ఆ సందర్భంగా వారు అందించిన తాడు, మోకును మెడలో వేసుకుని, వెనుక ఉన్న గాంధీ మహాత్ముడి ఫోటో సాక్షిగా, ముందున్న కాంగ్రెస్ నేతల సాక్షిగా నాలుగు పెగ్గు కల్లు తాగి తన బోసినోటితో చిద్విలాసంగా చిర్నవ్వులు చిందించారు. తెలంగాణా ప్రభుత్వం అసమర్దత కారణంగా రాష్ట్రంలో కల్తీ కల్లు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆ కారణంగా ఒకవైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే మరో వైపు స్వచ్చమయిన కల్లు సేకరించి అమ్ముకొనే గీత కార్మికులు రోడ్డున పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఎక్కడా తడబడకుండా ముక్తాయింపు పలికారు. వారి సమస్యల సంగతి ఎలా ఉన్నప్పటికీ దిగ్గీ రాజావారు చివరికి పబ్లిక్ గానే లొట్టలేసుకొంటూ కల్లు టేస్ట్ చూసేసారని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close