వరుసెంట సినిమాలు చేస్తున్నాడు.. దిల్ రాజు వ్యూహ రచన ఏంటో..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య స్పీడ్ పెంచాడనే అనాలి. ఒకప్పుడు సేఫ్ జోన్ చూసుకుని సినిమాలను నిర్మించే దిల్ రాజు ఇప్పుడు వరుస సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అప్పటిదాకా డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఆ సినిమా మొదలు అభిరుచి గల సినిమాలను నిర్మిస్తూ యూత్ లో తన బ్యానర్ అంటే ఒక క్రేజ్ ఏర్పడేలా చేసుకున్నాడు. రాజు సినిమాలో హీరో, హీరోయిన్ దర్శకుల కన్నా దిల్ రాజు అనే టైటిల్ కార్డ్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఇక 2011 దాకా జోరు మీదున్న దిల్ రాజు ఆ తర్వాత 2012లో ఒక్క సినిమా కూడా నిర్మించలేదు ఇక 2013-14ల్లో కూడా కేవలం ఒకటి రెండు సినిమాలనే నిర్మిస్తూ వచ్చాడు. అయితే 2015 నుండి మళ్లీ దిల్ రాజు తన సినిమాలను వరుసగా నిర్మించడం మొదలు పెట్టాడు. 2015 లో కేరింత, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలను నిర్మించిన రాజు ఈ సంవత్సరం ఇప్పటికే ఓ సినిమా రిలీజ్ చేయగా సెట్స్ మీద రెండు సినిమాలు ఉండగా.. మరో రెండు సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నాడు. అందులో మెగా హీరోల సినిమాలు రెండు కాగా మరోటి యువ సంచలనం రాజ్ తరుణ్ తో ఒకటి.

అయితే చిన్న సినిమాల్లో ఎక్కువ లాభం పొందుతున్న మితగా నిర్మాతల్లా తెలివి మీరి దిల్ రాజు కూడా నిర్మాతగా బిజీ అయ్యాడా అంటే తన బ్యానర్ కున్న వాల్యూ తో స్టార్ హీరోలతోనే సినిమా చేయగల రాజు కేవలం చిన్న హీరోలతో సరిపెట్టుకోవడంలో ఏదో ఆలోచన ఉండే ఉంటుంది. మరి వరుస సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు వ్యూహ రచన ఏంటో ఆయనకే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close