ఖమ్మంలో తెరాస ప్లీనరీకి ఈసీ అనుమతి మంజూరు

తెరాస పార్టీ ఈనెల 27న ఖమ్మంలో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. మే 1న జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నికలు జరుగుతున్నందున జిల్లాలో ఎనికల కోడ్ అమలవుతోంది. ఈ సమయంలో పార్టీ, ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకోవడం, తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని నేతల ప్రసంగాలు పాలేరు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి కనుక జిల్లాలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొనేందుకు అనుమతించవద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. కానీ ప్రతీ ఏటా తమ పార్టీ ఈవిదంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొంటూనే ఉంటుందని, ఈసారి కూడా ఉపఎన్నికలు ఉంటాయనే సంగతి తెలియక ఖమ్మం జిల్లాలో ప్లీనరీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసుకోన్నాము కనుక అనుమతించవలసిందిగా కోరుతూ మంత్రి కె.టి.ఆర్. ఎన్నికల సంఘానికి ఒక లేఖ వ్రాశారు. ఎన్నికల సంఘం ఆ అభ్యర్ధనని మన్నించి తెరాస పార్టీ ఖమ్మంలో ఏప్రిల్ 27న ప్లీనరీ నిర్వహించుకోవడానికి అనుమతించింది. అందుకు ఎటువంటి షరతులు కూడా విదిన్చినట్లు లేదని సమాచారం. ఈసీ నిర్ణయం పాలేరు ఉపఎన్నికలలో తెరాస గెలుపుకి చాలా దోహదపడవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close